Akhanda 2 Movie: ‘అఖండ 2’ మూవీ థియేటర్లో అఘోరాలు.. బాలయ్య శివ తాండవాన్ని చూసి.. వీడియో
అఖండ 2 తాండవం సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించారు. బాల మురళీ కృష్ణ పాత్ర తో పాటు అఖండ రుద్ర సికందర్ అఘోరా పాత్రను పోషించారు గాడ్ మాస్ మాసెస్. ఈ సినిమా మొత్తం అఘోరా పాత్ర చుట్టూ తిరుగుతుంది.

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా అఖండ 2 తాండవం. బోయపాటి శీను తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో హిందుత్వం, దైవ భక్తి, సనాతన ధర్మం వంటి అంశాలను చక్కగా చూపించడంతో ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఫ్యాన్స్ తో పాటు కామన్ అడియన్స్, పిల్లలు సైతం ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళుతున్నారు. అఖండ 2 తాండవం సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించారు. బాల మురళీ కృష్ణ పాత్ర తో పాటు అఖండ రుద్ర సికందర్ అఘోరా గా గాడ్ మాస్ మాసెస్. ముఖ్యంగా అఘోరా పాత్రలో నట విశ్వరూపం చూపించారు బాలయ్య. సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టే తిరుగుతుంది. సనాతన ధర్మం గురించి ఆయన చెప్పిన డైలాగులు, విలన్లను మట్టి కరిపించే సన్నివేశాలను చూసి ఆడియెన్స్ చప్పట్లు కొడుతున్నారు.
ఈ నేపథ్యంలో అఖండ 2 సినిమాకు సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో కొందరు అఘోరాలు థియేటర్కి వచ్చి ‘అఖండ 2’ సినిమాను వీక్షించడం మనం చూడవచ్చు. సినిమాలో బాలయ్య శివ తాండవాన్ని చూసిన అఘోరాలు పలు సందర్భాల్లో తమ సీట్ల నుంచి పైకి లేచి చప్పట్లు కొడుతూ కనిపించారు. ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ వీరు ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిన విభూతి కాషాయ యోగులు అని సదరు నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదే..
వీరు థియేటర్ కు రావడం బహుశా మొదటి సారేమో. వారిని అలా రప్పించడమే కష్టం. యూపీలో వచ్చిన విభూతి కాషాయ యోగులు అఖండ తాండవం చూసి, సీట్ల నుండి లేచి కరతాళ ధ్వనులతో ఈ వేదభూమిలో మొదటి సారి పులకరిస్తుంటే.. శివయ్యగా నటించిన బాలయ్య జన్మసార్థకం అనిపించింది…#Akhanda2 #Akhanda2Thaandavam pic.twitter.com/11etQ4Nq1C
— Swathi Reddy (@Swathireddytdp) December 14, 2025
అఖండ 2 సినిమాలో సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించగా, బజరంగీ భాయిజాన్ ఛైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా బాలయ్య కూతురి పాత్రలో ఆకట్టుకుంది . అలాగే ఆది పినిశెట్టి, కబీర్ దుల్హన్ సింగ్, సాస్వత ఛటర్జీ, అచ్యుత్ కుమార్, పూర్ణ, , హర్ష, జగపతి బాబు, రచ్చ రవి, అయ్యప్ప తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








