AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: ‘ఏదో ఒకరోజు ఇదంతా కలగా మారిపోతుంది.. నాలో ఏదో తెలియని మార్పు’.. ఆసక్తికర పోస్ట్ చేసిన శ్రుతిహాసన్.. ఏం జరిగిందబ్బా..

ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ నటిస్తోన్న ఎన్బీకే 107 చిత్రాలలో నటిస్తోంది శ్రుతి. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Shruti Haasan: 'ఏదో ఒకరోజు ఇదంతా కలగా మారిపోతుంది.. నాలో ఏదో తెలియని మార్పు'.. ఆసక్తికర పోస్ట్ చేసిన శ్రుతిహాసన్.. ఏం జరిగిందబ్బా..
Shruthi Haasan
Rajitha Chanti
|

Updated on: Sep 18, 2022 | 12:04 PM

Share

రీఎంట్రీ తర్వాత క్రాక్ సినిమాతో శ్రుతి హాసన్ (Shruti Haasan) క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మాస్ మాహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో.. శ్రుతికి తెలుగులో మళ్ళీ ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అందులో ఒకటి పాన్ ఇండియా కావడం విశేషం. కేజీ ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో రాబోతున్న సలార్ చిత్రంలో శ్రుతి హాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్ ఆద్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ నటిస్తోన్న ఎన్బీకే 107 చిత్రాలలో నటిస్తోంది శ్రుతి. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా శ్రుతి..తన ఇన్ స్టా ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. తనకు సంబంధించిన ఫోటోలతోపాటు.. యానిమేషన్ చిత్రం ది టేల్ ఆఫ్ ప్రిన్సెస్ కగుయా ఫోటోలను షేర్ చేసింది. “జీవిత కాలాలు క్రమంగా వస్తాయి, పోతాయి … ఏదో ఒక రోజు ఇదంతా కలగా మిగిలిపోతుంది. నాలో ఏదో మార్పు తెచ్చిన ఈ అత్యంత అందమైన చిత్రాన్ని నాకు పరిచయం చేసినందుకు @santanu_hazarika_artకి ధన్యవాదాలు. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. శ్రుతి హాసన్ శాంతను హజారిక అనే చిత్రకారుడితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అతడితో కలుసున్న ఫోటోస్ షేర్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.