AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్ నిత్యా మీనన్ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్టు షేర్ చేసిన నటి

స్టార్ హీరోయిన్‌ నిత్యా మీనన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నటి అమ్మమ్మ వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో నిత్య ఎమోషనల్‌ పోస్టు పెట్టింది. తన అమ్మమ్మ, తాతతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది..

హీరోయిన్ నిత్యా మీనన్ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్టు షేర్ చేసిన నటి
Nithya Menen
Srilakshmi C
|

Updated on: Jul 16, 2023 | 9:32 AM

Share

స్టార్ హీరోయిన్‌ నిత్యా మీనన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నటి అమ్మమ్మ వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో నిత్య ఎమోషనల్‌ పోస్టు పెట్టింది. తన అమ్మమ్మ, తాతతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది.’ఒక శకం ముగిసింది. గుడ్‌బై అమ్మమ్మా.. నా చెర్రీమ్యాన్. సీ యూ ఆన్‌ ది అదర్‌ సైడ్‌’ అంటూ భావోద్వేగానికి లోనైంది. నిత్య షేర్‌ చేసిన ఈ ఫొటోలో నిత్యని వాళ్ల అమ్మమ్మ ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకోవడం కనిపిస్తుంది. వాళ్లిద్దరి మధ్య బాండింగ్‌ ఈ ఫొటో తెలియజేస్తుంది. దీనిపై నిత్యా అభిమానులు స్పందిస్తూ.. ధైర్యంగా ఉండాలంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్ సెక్షన్‌లో చెబుతున్నారు.

నాని సరసన అలా మొదలైంది సినిమాలో నటించిన ఈ కేరళ కుట్టి తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి హిట్‌ అందుకుంది. ఆ తర్వాత ఇష్క్‌, ఒక్కడినే, గుండె జారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా బీమ్లా నాయక్‌ మువీలో నిత్యా నటించిన సంగతి తెలిసిందే. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఇప్పటి వరకు 50కి పైగా మువీల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఒక్క తెలుగు మువీ కూడా లేదు. తమిళలంలో ఒకటి, మలయాలంలో మరో మువీలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.