Prabhas: ప్రభాస్ సరసన ‘ఇస్మార్ట్ శంకర్’ భామ.. ఎట్టకేలకు సెట్లో అడుగుపెట్టిన హీరోయిన్..
డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ కల్కి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. భారీ తారగణం.. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అమితాబ్, కమల్ హాసన్, దిశా పటానీ, దీపికా పదుకొణె వంటి స్టార్స్ అంతా కలిసి నటిస్తున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే ఈ సినిమానే కాకుండా అటు సైలెంట్ షూటింగ్ కంప్లీట్ చేస్తున్న మరో ప్రాజెక్ట్ రాజాసాబ్. ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు.
బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న హీరో ప్రభాస్. సలార్ మూవీతో మాస్ నటవిశ్వరూపం చూపించిన ప్రభాస్.. ఇప్పుడు వరుస చిత్రాలతో వెండితెరపై సందడి చేయబోతున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ కల్కి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. భారీ తారగణం.. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అమితాబ్, కమల్ హాసన్, దిశా పటానీ, దీపికా పదుకొణె వంటి స్టార్స్ అంతా కలిసి నటిస్తున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే ఈ సినిమానే కాకుండా అటు సైలెంట్ షూటింగ్ కంప్లీట్ చేస్తున్న మరో ప్రాజెక్ట్ రాజాసాబ్. ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు.
హార్రర్ కామెడీ జోనర్ లో వస్తోన్న ఈ మూవీలో మలయాళీ బ్యూటీ మాళవికా మోహనన్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలుగా వేగంగా జరుగుతుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఒకప్పటి డార్లింగ్ కంబ్యాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మాస్, యాక్షన్ కాకుండా ఈసారి తనదైన కామెడీతో మరోసారి నవ్వించేందుకు రెడీ అయ్యారు ప్రభాస్. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతుందని.. ఈరోజు హీరోయిన్ నిధి అగర్వాల్ రాజాసాబ్ సెట్ లో అడుగుపెట్టిందని సమాచారం. ఇక ఇప్పుడు ప్రభాస్, నిధి అగర్వాల్ కాంబోలో వచ్చే సీన్స్ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే రాజాసాబ్ అప్డేట్స్ రివీల్ చేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు టాక్.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈసినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సెట్ నుంచి పలు వీడియోస్, ఫోటోస్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. అలాగే హీరోయిన్ మాళవిక మోహనన్ కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల వీడియోస్ నెట్టింట లీక్ అయ్యాయి. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్రలో నటిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
Style on point 👌😎 #Nidhhiagerwal arrived in Hyderabad for #therajasaab Papped at airport @AgerwalNidhhi #Prabhas pic.twitter.com/3A8x11krNr
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) April 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.