గుజరాత్లోని గాంధీనగర్లో హోంవర్క్ చేయలేదని తొమ్మిదో తరగతి విద్యార్థినిని కొట్టిన టీచర్కు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ ఘటనలో విద్యార్థిని కర్ణభేరి దెబ్బతినడంతో తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఐదేళ్ల విచారణ అనంతరం టీచర్కు మూడేళ్ల మూడు నెలల జైలు శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా విధించింది.