తులసి మొక్కకు ఎరుపు దారం కడితే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా? సంపద రెట్టింపు..!
హిందూ ధర్మంలో పవిత్రమైన తులసి మొక్క ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. తులసికి ఎరుపు దారం కట్టడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై ధనలాభం కలుగుతుంది. శుక్రవారం ఈ పరిహారం పాటించడం శ్రేష్ఠం. ఎండిన తులసి మొక్కను ఇంట్లో ఉంచకూడదు, అది ప్రతికూల శక్తిని, ఆర్థిక ఇబ్బందులను తెస్తుంది. పితృదోషానికి కూడా సంకేతం కావచ్చు, కాబట్టి జాగ్రత్త వహించడం ముఖ్యం.

హిందూ ధర్మంలో తులసి మొక్కను అత్యంత పవిత్రంగా చూస్తారు. తులసిని దేవతగా భావించి పూజిస్తారు. ప్రతి ఇంట్లోనూ తులసి కోట ఉంటుంది. ఉదయాన్నే తులసికి నీరు పోసి, నిత్యం దీపం వెలిగిస్తారు. తులసిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు నెలకొంటాయని నమ్మకం. కానీ మీరు ఎప్పుడైనా తులసి మొక్కకు చిన్న పరిహారం పాటించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని విన్నారా..? అంతేకాదు.. ఈ పరిహారంతో మీ ఇంటి ఖజానా బంగారం నిండి పోతుందని చెబుతున్నారు. అలాంటి అద్భుత ఉపాయం ఏంటో ఇక్కడ చూద్దాం…
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇంట్లోని తులసి మొక్కకు ఎరుపు రంగు దారం కడితే మీరు ఊహించని ఫలితాలు పొందుతారు. దీనివల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలా చేయడం వల్ల మీ ఇంటిలోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ శుభ కార్యం శుక్రవారం నాడు చేయడం మరి ఉత్తమం అంటున్నారు.
అలాగే, మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే.. దానిని ఎక్కువ కాలం ఉంచకూడదు. ఎందుకంటే ఇది ప్రతికూలశక్తిని కలిగిస్తుంది. మీ ఇంట్లో పితృదోషం ఉంటే తులసి మొక్క ఎండిపోయే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతున్నట్లయితే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని సంకేతం అంటున్నారు.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
