AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kriti Sanon: ఆదిపురుష్ సినిమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.. ట్రోల్స్ పై స్పందించిన కృతి..

హీరోయిన్ కృతి సనన్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. " డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భాగం అవుతున్నందుకు

Kriti Sanon: ఆదిపురుష్ సినిమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.. ట్రోల్స్ పై స్పందించిన కృతి..
Kriti Sanon
Rajitha Chanti
|

Updated on: Nov 20, 2022 | 5:05 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్‌ ధవన్‌, కృతిససన్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భేదియా. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో తోడేలు టైటిల్‌తో “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ద్వారా విడుదలవుతుంది. ఈ సినిమా తెలుగులో నవంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తెలుగు ప్రీ రిలీజ్‌ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ కృతి సనన్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ” డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భాగం అవుతున్నందుకు మేమంతా గర్వపడుతున్నాం. మన చరిత్ర .. ఇతిహాసాలను ప్రపంచం ముందు ఉంచేలా భారీ కాన్వాసుపై తీర్చిదిద్దుతున్నారాయన. దీంట్లో లోపాలు వెతకకుండా సరైన రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాలి. ఓం అత్యుత్తమం ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ముందుకు టీజర్ తీసుకువచ్చారు మేకర్స్. అయితే ఇందులో ప్రభాస్ లుక్స్… వీఎఫ్ఎక్స్ అభిమానులను నిరాశపరిచింది. దీంతో ఈ మూవీ టీజర్ పై దారుణంగా ట్రోల్స్ జరిగాయి.

ఇవి కూడా చదవండి

రామయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా .. కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది జూన్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకుంటుంది.