AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andrea Jeremiah : అరుదైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఒళ్లంతా మచ్చలు.. కనుబొమ్మలు తెల్లగా..

ఆండ్రియా జెరెమియా.. దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సినిమాలకు దూరమయ్యింది. దీంతో ఆమె లవ్ బ్రేకప్ జరిగి డిప్రెషన్ అంటూ అనేక వార్తలు వినిపించాయి. తాజాగా సినిమాలకు బ్రేక్ తీసుకోవడం పై రియాక్ట్ అయ్యింది ఆండ్రియా.

Andrea Jeremiah : అరుదైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. ఒళ్లంతా మచ్చలు.. కనుబొమ్మలు తెల్లగా..
Andream Jeremiah
Rajitha Chanti
|

Updated on: Nov 21, 2024 | 7:01 AM

Share

ఇటీవల సినీతారల తమ వ్యక్తిగత సమస్యలు బయటపెట్టేందుకు అసలు చింతిచడం లేదు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో ఆరోగ్య సమస్యలను పంచుకుంటున్నారు. ఇదివరకే తాను మయోసైటిస్ సమస్యతో బాధ పడుతున్నట్లు హీరోయిన్ సమంత వెల్లడించింది. అలాగే తాను తీసుకుంటున్న చికిత్స గురించి ప్రతిసారి అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను మరింత అలర్ట్ చేసింది. తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ సైతం తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. తనే హీరోయిన్ ఆండ్రియా జెరెమియా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా.. అనేక విషయాలను పంచుకుంది. సింగర్ గా సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా మారి ప్రేక్షకుల మనసు దోచుకున్న స్టార్ ఆండ్రియా జెరెమియా. తమిళం, మలయాళం, హిందీ, తెలుగు భాషలలో నటించి మెప్పించింది.

అన్న యమ్ రసూల్ సినిమా ద్వారా మలయాళీ సినీరంగంలోకి అడుగుపెట్టింది ఆండ్రియా. లోహం, లండన్ బ్రిడ్జ్, థోపిల్ జోప్పన్ వంటి చిత్రాల్లో ఆండ్రియా నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు నటనకు గుడ్ బై చెప్పింది ఆండ్రియా. చివరిసారిగా ఆమె నటించిన చిత్రం. వడ చెన్నై. తమిళంలో విడుదలైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆండ్రియా మాట్లాడుతూ.. వడ చెన్నై సినిమా తర్వాత తనకు ఆటో ఇమ్యూన్ స్కిన్ కండిషన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని.. ఈ వ్యాధి రావడంతో కనుబొమ్మలు, వెంట్రుకలు బూడిద రంగులోకి మారడం ప్రారంభించాయని తెలిపింది.

రోజూ నిద్ర లేవగానే శరీరంపై ఎన్నో మచ్చలు కనిపిస్తాయని… రక్త పరీక్షలో వ్యాధిని గుర్తించలేదు. ఈ పరిస్థితికి కారణం మానసిక ఒత్తిడి అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. అనారోగ్యంతో బాధపడుతూ సినిమాలకు దూరంగా ఉన్నానని.. కానీ తాను బ్రేక్ తీసుకోవడంతో తనకు లవ్ బ్రేకప్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లానంటూ వార్తలు వచ్చాయని తెలిపింది. ఈ వ్యాధికి సంబంధించిన అనేక మచ్చలు ఇప్పటికీ శరీరంపై ఉన్నాయని.. ఇంకా కనురెప్పలు తెల్లగా ఉన్నాయని.. ఇందుకు ఆక్యుపంక్చర్ ట్రీట్ మెంట్ తనకు మేలు చేసిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆండ్రియా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.