AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: ‘సూపర్‌ థ్రిల్లింగ్‌గా ఉంది.. 37 ఏళ్ల తర్వాత నా బీటెక్‌ డిగ్రీ తీసుకున్నా.. కానీ ఆసక్తి లేదు’

తెలుగు సినీ వినీలాకాశంలో అసమాన చిత్రాలను తీసి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన వివాదాస్ప దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. లోతైన ఆలోచన దృక్పథం, తెలుగు-ఇంగ్లిష్‌ సాహిత్యాన్ని అవసోసన పట్టిన మేథావి అయిన ఆర్జీవీ తాజాగా నాగార్జున యూనివర్సిటీలో..

Ram Gopal Varma: 'సూపర్‌ థ్రిల్లింగ్‌గా ఉంది.. 37 ఏళ్ల తర్వాత నా బీటెక్‌ డిగ్రీ తీసుకున్నా.. కానీ ఆసక్తి లేదు'
Ram Gopal Varma
Srilakshmi C
|

Updated on: Mar 19, 2023 | 2:06 PM

Share

తెలుగు సినీ వినీలాకాశంలో అసమాన చిత్రాలను తీసి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. లోతైన ఆలోచన దృక్పథం, తెలుగు-ఇంగ్లిష్‌ సాహిత్యాన్ని అవపోసన పట్టిన మేథావి అయిన ఆర్జీవీ తాజాగా నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు కంపరం పుట్టిస్తున్నాయి. తిని, తాగి ఎంజాయ్ చేయండి.. స్వర్గంలో రంభ ఊర్వశి ఉంటారో లేదో తెలియదు.. ఇక్కడే ఎంజాయ్ చేయండి.. ప్రపంచంలో మగాళ్లందరూ చచ్చిపోయి నేనొక్కడినే మిగలాలని కోరుకుంటున్నాను.. అప్పుడు ఆడజాతికి నేనే దిక్కవుతా లాంటి మాటలు రాంగోపాల్ వర్మ నోట రావడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎదుటివారు ఏమనుకుంటారో అని బతికేవాడు చచ్చిపోయినట్టేననే మాటలు విద్యార్ధులతో చెప్పవచ్చా లేదా అనే కామన్‌సెన్స్‌ లేకుండా మాట్లాడారంటూ సర్వత్రా విమర్శలొస్తున్నాయి.

నిజానికి ఆర్జీవీ కూడా ఏఎన్‌యూ విద్యార్ధే. ఆ విషయాన్ని రాం గోపాల్‌ వర్మ స్వయంగా ట్విటర్‌లో వెల్లడించాడు. రామ్ గోపాల్ వర్మ విజయవాడలోని విఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో 1985లో బీటెక్ పూర్తి చేశాడు. సెకండ్ క్లాస్‌లో పాసైనప్పటికీ అప్పటి నుంచి ఆ డిగ్రీ పట్టాని అందుకోలేదు. తాజాగా విజయవాడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమిక్ ఎగ్జిబిషన్‌ కార్యక్రమానికి అతిథిగా వెళ్లిన ఆర్జీవీ బీటెక్ డిగ్రీ పట్టాని అందుకున్నాడు. 37 ఏళ్ల తర్వాత పట్టా అందుకోవడం థ్రిల్‌గా ఉందంటూ తన పోస్టులో పేర్కొన్నాడు. తనకు నాగార్జున వర్సిటీ అధికారులు డిగ్రీ పట్టా ఇస్తున్న ఫొటోను వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘బీటెక్ పాస్ అయిన 37 ఏళ్ళ తరువాత నా డిగ్రీ పట్టాని అందుకోవడం సూపర్ థ్రిల్‌గా ఉంది. సివిల్ ఇంజినీరింగ్ ప్రాక్టీస్ చేయాలనే ఆసక్తి నాకు లేదు. అందుకే 1985 నుంచి నా డిగ్రీ పట్టాని తీసుకోలేదు. థ్యాంక్యూ..’ అంటూ రాసుకొచ్చాడు. వర్మ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వెరల్‌ అవుతోంది. రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా తొలుత వైరల్‌ అయ్యి.. ఆ తర్వాత కాంట్రవర్సీ అవుతుంది. ప్రస్తుతం నాగార్జున వర్సిటీలో ఆర్జీవీ వ్యాఖ్యలు అలాంటి దుమారాన్నే లేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్తే.. టీమిండియాకు శనిలా..
సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్తే.. టీమిండియాకు శనిలా..
ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లపై కేంద్రం క్లారిటీ.. ఈ సారి పెంచకపోవడానికి.
ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లపై కేంద్రం క్లారిటీ.. ఈ సారి పెంచకపోవడానికి.
టిఫిన్ బాక్స్‌తో ముంబై ట్రైన్ ఎక్కాడు.. కట్ చేస్తే.. రూ.42 వేల..
టిఫిన్ బాక్స్‌తో ముంబై ట్రైన్ ఎక్కాడు.. కట్ చేస్తే.. రూ.42 వేల..
ఇదెక్కడి మాస్ రా మావా.. చిరుతతో సరదాగా హోలీ ఆడిన ఊరి జనం.. వీడియో
ఇదెక్కడి మాస్ రా మావా.. చిరుతతో సరదాగా హోలీ ఆడిన ఊరి జనం.. వీడియో
రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..
రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..
విజయ్ విడాకుల విషయంలో వేణు స్వామి సంచలన కామెంట్స్..
విజయ్ విడాకుల విషయంలో వేణు స్వామి సంచలన కామెంట్స్..
చిన్నస్వామి గడ్డపై మళ్ళీ కోహ్లీ గర్జన..ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు పండుగ
చిన్నస్వామి గడ్డపై మళ్ళీ కోహ్లీ గర్జన..ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు పండుగ
నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం..
నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..