AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: జరిమానా కట్టమన్నందుకు రవాణా అధికారిపై కొబ్బరి బోండాల వ్యాపారి కత్తితో దాడి

జరిమానా కట్టమన్నందుకు రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేశాడు. ఈ షాకింగ్‌ ఘటన..

AP News: జరిమానా కట్టమన్నందుకు రవాణా అధికారిపై కొబ్బరి బోండాల వ్యాపారి కత్తితో దాడి
Coconut Vendor
Srilakshmi C
|

Updated on: Mar 17, 2023 | 3:22 PM

Share

జరిమానా కట్టమన్నందుకు రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేశాడు. ఈ షాకింగ్‌ ఘటన కాకినాడలో శుక్రవారం (మార్చి 17) ఉదయం చోటుచేసుకుంది. దాడిలో అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ నగరంలో దేవాదాయ శాఖ కార్యాలయం సమీపంలోని జెడ్పీ సెంటర్‌ వద్ద పెంటా వెంకట దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తి వ్యాన్‌ను నిలిపి కొబ్బరి బోండాలు అమ్ముతున్నాడు. అటుగా వచ్చిన అసిస్టెంట్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం చిన్నారావు వ్యాన్‌కు సంబంధించిన పత్రాలు చూపమని కోరాడు. తనిఖీల నిమిత్తం వ్యాన్‌ రికార్డులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్‌ పత్రాలు చూపాలని, వాహనానికి ఇది వరకే పడిన ఫైన్‌ కట్టాలని ఇన్‌స్పెక్టర్‌ సూచించారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన దుర్గాప్రసాద్‌ తన వద్ద ఉన్న కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో ఇన్‌స్పెక్టర్‌ చిన్నారావుపై దాడి చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపైనా దాడికి దిగడంతో ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం విరమించుకున్నారు. ఈ ఘటనలో రవాణా శాఖ అధికారి చేతి బొటనవేలు తెగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇన్‌స్పెక్టర్‌ను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడు దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగిందని, ప్రస్తుతం ప్రస్తుతం చిన్నారావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.