AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోల్డ్ స్క్రిప్ట్‌తో వెబ్ సిరీస్‌లోకి మాస్ డైరెక్టర్..?

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవలే ఎనర్జిటిక్ హీరో రామ్‌తో 'ఇస్మార్ట్ శంకర్‌' మూవీతో సూపర్ హిట్ కొట్టి..

బోల్డ్ స్క్రిప్ట్‌తో వెబ్ సిరీస్‌లోకి మాస్ డైరెక్టర్..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 19, 2020 | 3:32 PM

Share

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవలే ఎనర్జిటిక్ హీరో రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్‌’ మూవీతో సూపర్ హిట్ కొట్టి.. తనేంటో మళ్లీ నిరూపించుకున్నాడు. ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండతో మరో కొత్త సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. కానీ.. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ టీమ్ మొత్తం ఇంటికే పరిమితమైపోయింది.

ఇక ఇంట్లో ఖాళీగా ఉన్న పూరీ.. ఓ వెబ్ సిరీస్ కోసం ప్లాన్ చేస్తున్నారట. ఇన్నాళ్లు పెద్ద తెరపై ఆట ఆడిన పూరీ ఇకపై ఓటీటీలో అడుగు పెట్టబోతున్నారట. వెబ్ సిరీస్ కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓటీటీ యాప్‌లకు మంచి డిమాండ్ పెరిగింది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, బడా డైరెక్టర్లు ఓటీటీ యాప్‌ల వైపు చూస్తున్నారు. తాజాగా పూరి కూడా రాబోయే రోజుల్లో ఓ బోల్డ్ వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఆ వెబ్ సిరీస్‌ని ఓ ప్రముఖ ఓటీటీ యాప్‌లో విడుదల చేయబోతున్నారట. అన్నీ కరెక్టుగా సెట్ అయితే.. కరోనా వ్యాప్తి తగ్గిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని సమాచారం.

Read More:

బ్రేకింగ్: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ మృతి

పవన్‌‌తో సినిమా తీస్తా.. అది ఏడాది పండగలా ఉంటుంది: బండ్ల గణేష్