Ram gopal Varma: ఇకపై ఓటీటీ కోసమే సినిమాలు తీసే పరిస్థితి వస్తుంది.. బాలీవుడ్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..

Ram gopal Varma: ప్రస్తుతం బాలీవుడ్‌ వర్సెస్‌ సౌత్‌ సినిమా ఇండస్ట్రీ అనే అంశం చర్చనీయాంశంగా మారింది. తెలుగు సినిమాలు దక్షిణాదిలో దుమ్మురేపుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీపై పడింది...

Ram gopal Varma: ఇకపై ఓటీటీ కోసమే సినిమాలు తీసే పరిస్థితి వస్తుంది.. బాలీవుడ్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..
Follow us

|

Updated on: May 13, 2022 | 2:32 PM

Ram gopal Varma: ప్రస్తుతం బాలీవుడ్‌ వర్సెస్‌ సౌత్‌ సినిమా ఇండస్ట్రీ అనే అంశం చర్చనీయాంశంగా మారింది. తెలుగు సినిమాలు దక్షిణాదిలో దుమ్మురేపుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీపై పడింది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌-2 వంటి చిత్రాలు బాలీవుడ్‌లోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నిత్యం ఏదో ఒక వార్తలో నిలిచే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ బాలీవుడ్‌ వర్సెస్‌ టాలీవుడ్‌ అంశంపై కూడా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వరుస కామెంట్లు చేస్తూ వస్తున్నారు. తాజాగా మహేష్‌ బాబు బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలను ఊటంకించిన వర్మ.. బాలీవుడ్‌పై వ్యంగ్యంగా స్పందించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు వర్మ. బాలీవుడ్ ఇండస్ట్రీపై తనదైన శైలిలో స్పందించిన వర్మ.. ‘థియేటర్లలో దక్షిణాది చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడం, ఉత్తరాది చిత్రాలు డీలా పడటం చూస్తుంటే.. త్వరలోనే బాలీవుడ్‌ కేవలం ఓటీటీ కోసమే సినిమాలు తెరకెక్కించే రోజులు వచ్చేలా ఉన్నాయి’ అని వర్మ అన్నారు. దీంతో ఇప్పుడు ఈ అంశం కాస్త మరింత వైరల్‌గా మారింది. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి కొత్త చర్చకు దారి తీశాయి. గత కొన్ని రోజులుగా సౌత్‌ వర్సెస్‌ నార్త్‌ అన్నట్లుగా సాగుతోన్న వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..