AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాపై ప్రభాస్‌కి క్రష్‌ ఉండేదట: భాగ్యశ్రీ

తనపై ఒకానొక సమయంలో ప్రభాస్‌కి క్రష్ ఉండేదట అని చెప్పుకొచ్చారు భాగ్యశ్రీ. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ రాధే శ్యామ్‌లో నటిస్తుండగా

నాపై ప్రభాస్‌కి క్రష్‌ ఉండేదట: భాగ్యశ్రీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 02, 2020 | 2:32 PM

Share

Bhagyashree Prabhas Radhe Shyam: తనపై ఒకానొక సమయంలో ప్రభాస్‌కి క్రష్ ఉండేదట అని చెప్పుకొచ్చారు భాగ్యశ్రీ. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ రాధే శ్యామ్‌లో నటిస్తుండగా.. అందులో డార్లింగ్ తల్లిగా భాగ్య శ్రీ కనిపించనున్నారు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ( యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా సంతోషి నియామకం

రాధే శ్యామ్‌లోని చాలా మంది నా మైనే ప్యార్‌ కియా సినిమాకు అభిమానులట. తనపై ఒకానొక సమయంలో క్రష్‌ ఉండేదని ప్రభాస్ నాకు చెప్పాడంటూ భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నా కోసం హైదరాబాదీ స్వీట్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. నేను తినేందుకు 15 రకాల వంటలను టేబుల్‌పై పెట్టేవారు అని భాగ్యశ్రీ తెలిపారు. కాగా రాధే శ్యామ్‌లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న రాధే శ్యామ్‌పై అన్ని ఇండస్ట్రీల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ( క్వారంటైన్‌లోకి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్)