AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Horror Movie: ఇదెక్కడి హారర్ సిరీస్‍ రా బాబూ.. వెన్నులో వణుకుపుట్టిస్తోంది.. ఒంటరిగా చూసే ధైర్యముందా..?

వెన్నులో వణుకుపుట్టించే హారర్ మూవీ చూసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఇప్పుడు ఎక్కువగా ఇలాంటి కంటెంట్ చిత్రాలనుఅడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు ఓటీటీ మేకర్స్. తాజాగా హారర్ లవర్స్ ముందుకు ఒకప్పటి సిరీస్ వస్తోంది.

OTT Horror Movie: ఇదెక్కడి హారర్ సిరీస్‍ రా బాబూ.. వెన్నులో వణుకుపుట్టిస్తోంది.. ఒంటరిగా చూసే ధైర్యముందా..?
Ott Movies
Rajitha Chanti
|

Updated on: Nov 19, 2024 | 8:02 AM

Share

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లలో కొన్నాళ్లుగా హారర్ కంటెంట్ చిత్రాలు అధికంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, ఆసక్తిని రేకెతెత్తించే వెబ్ సిరీస్ నిత్యం సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వణికించే హారర్ సిరీస్ మళ్లీ వస్తోంది. 1990ల్లో టీవీ ప్రేక్షకులను అలరించిన అనేక హారర్ షోలు మళ్లీ వరుస కడుతున్నాయి. ఇప్పుడు అలాంటిదే ‘ది జీ హారర్’ షో. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈసిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఇది సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లోని CID, దూరదర్శన్‌లోని ఫౌజీతో సహా – తెరపైకి తిరిగి వస్తున్న 1990ల షోల జాబితాలో సిరీస్.

‘భయం ముగిసిపోవడం లేదు. మొదలవుతుంది. సిద్ధంగా ఉండండి’ అనే క్యాప్షన్ తో ఓ చిన్న టీజర్ ను ఆదివారం జీ5 ఓటీటీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ది జీ హారర్ షో జీ5 ఓటీటీలో త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ఈ షోకు సంబంధించిన విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇవి కూడా చదవండి

ది జీ హారర్ షో..

1993 నుంచి 2001 వరకు జీటీవీలో ది జీ హారర్ షో టెలికాస్ట్ అయ్యింది. ఈ హారర్ జానర్ షో 1990ల్లో ఎక్కువ మంది చూసిన షో ఇదే. మొత్తం 350 ఎపిసోడ్స్ ఉంటాయి. దీనిని ది రామ్సే బ్రదర్స్ తెరకెక్కించారు. ఇందులో భయానక వ్యక్తులు,నమ్మలేని నిజాలు, శాపగ్రస్తమైన ఇళ్ల గురించి ఈ షోలో చూపించేవారు. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో భయానక ఘటన గురించి వివరిస్తుంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ హారర్ షో ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. దస్తక్ అనే మొదటి ఎపిసోడ్‌లో పంకజ్ ధీర్, షగుఫ్తా అలీ , అర్చన పురాణ్ సింగ్ నటించారు. ఇది ఆగస్ట్ 9, 1993న ప్రసారమైంది. రోహిత్ రాయ్, దీప్శిఖా నాగ్‌పాల్ నటించిన చివరి ఎపిసోడ్ 2001లో ప్రసారమైంది.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.