Rashmika Mandanna: సిద్ధుతో కలిసి రయ్యుమంటూ స్కూటర్ పై చక్కర్లు కొట్టిన రష్మిక మందన్నా.. నెట్టింట వైరలవుతున్న వీడియో..
యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో జనవరి 20న స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. అందులో భాగంగా ముంబై బాంద్రా పోర్టులో ఏర్పాటు చేసిన
పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ రష్మికకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం తమిళ్, తెలుగు, హిందీలోనూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ చిన్నది. ఇటీవలే గుడ్ బై సినిమాతో నార్త్ ఆడియన్స్ ముందుకు వచ్చిన రష్మిక.. ఆశించిన స్తాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో జనవరి 20న స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. అందులో భాగంగా ముంబై బాంద్రా పోర్టులో ఏర్పాటు చేసిన రబ్బా జండా సాంగ్ లాంచ్ ఈవెంట్ కు హీరో హీరోయిన్స్ ఇద్దరూ స్కూటర్ పై వచ్చి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఆ వీడియోలో సిద్ధూ స్కూటర్ నడుపుతుండగా.. వెనక సీటులో రష్మిక కూర్చుంది. అనంతరం వీరిద్దరు కలిసి సాంగ్ లాంచ్ వేదికపైకి చేరుకున్నారు. స్కూటర్ సిద్ధూ, రష్మిక వస్తుంటే ఫ్యాన్స్ చుట్టుమూట్టారు. ఇక ఈ వీడియోకు నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇదే కాకుండా హిందీలో యానిమల్ సినిమాలో నటిస్తోంది రష్మిక. ఇందులో రణబీర్ సింగ్ కథానాయికుడిగా నటిస్తుండగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు.
అలాగే తెలుగులో పుష్ప 2లోనూ నటిస్తోంది రష్మిక. డైరెక్టరు సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న ఈ మూవీలో సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా.. కీలకపాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.