AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: హిందీ ‘అల వైకుంఠపురం’ కు బ్రేక్.. సినిమాను విడుదల చేయట్లేదని ప్రకటించిన నిర్మాత.. కారణమేంటంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా 'పుష్ప' బాలీవుడ్ లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.  ముఖ్యంగా ఊర మాస్ పాత్రలో నటించిన బన్నీకి బాలీవుడ్ సినిమా ప్రియులు ఫిదా

Allu Arjun: హిందీ 'అల వైకుంఠపురం' కు బ్రేక్.. సినిమాను విడుదల చేయట్లేదని ప్రకటించిన నిర్మాత.. కారణమేంటంటే..
Ala Vaikuntapurramloo
Basha Shek
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 22, 2022 | 9:46 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’ బాలీవుడ్ లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.  ముఖ్యంగా ఊర మాస్ పాత్రలో నటించిన బన్నీకి బాలీవుడ్ సినిమా ప్రియులు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే హిందీలో  80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం వందకోట్ల వైపు వేగంగా దూసుకెళుతోంది.  ఇలా పుష్ప మేనియా సాగుతుండగానే ఐకాన్ స్టార్ క్రేజ్ ను మరింత క్యాష్ చేసుకోవాలని భావించారు గోల్డ్ మైన్ టెలీఫిల్మ్స్ అధినేత మనీశ్ షా. ఈ క్రమంలోనే బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘ అల..వైకుంఠపురం’ లో హిందీ వెర్షన్ ని ఈనెల 26న సుమారు 200 థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. అయితే ఇప్పుడు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు మనీశ్.  ఈ చిత్రాన్ని విడుదల చేయడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

కాగా ‘అల వైకుంఠ పురం’ సినిమాను ఇప్పటికే హిందీలో ‘షెజాదా’ పేరుతో  రీమేక్ చేస్తున్నారు. యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్, భూషణ్ కుమార్, అమన్ గిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 2న సినిమాను విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు.  ఓవైపు ‘షెజాదా’ షూటింగ్ జరుగుతుండగానే .. మరోవైపు తెలుగు ‘అల..వైకుంఠపురం’ సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేయడం ‘షెజాదా’ నిర్మాతలను కలవరపెట్టింది. హిందీ వెర్షన్ విడుదలైతే తమ సినిమాపై ఆసక్తి తగ్గిపోతుందని, ప్రేక్షకులు థియేటర్లకు రారేమోనని నిర్మాతలు కంగారు పడ్డారు. దీంతో సినిమా విడుదల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మనీశ్ షాకు విన్నవించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. సినిమాను విడుదల చేయడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇందుకు గాను ‘షెజాదా’ నిర్మాతలు మనీశ్ షాకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:IND VS SA: రెండో వన్డేలోనూ చతికిల పడిన టీమిండియా .. సిరీస్ సఫారీల వశం..

BMW X3 SUV: బీఎండబ్ల్యూ నుంచి మరో సరికొత్త కారు..!

Telugu Man Married Turkey Woman: గుంటూరు అబ్బాయి , టర్కీ అమ్మాయి ఒక్కటైన వేళ..ఎట్రాక్ట్ చేస్తున్న వీడియో..