కరోనా లాక్డౌన్: అమెరికాలో అత్యధిక మంది చూసిన చిత్రం మనదే..!
కరోనా నేపథ్యంలో అమెరికాలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇళ్లకే పరిమితమైన అమెరికావాసులు టీవీలకు అతుక్కుపోయారు.

కరోనా నేపథ్యంలో అమెరికాలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇళ్లకే పరిమితమైన అమెరికావాసులు టీవీలకు అతుక్కుపోయారు. ఈ క్రమంలో ఈ వారంలో అక్కడి వారు అత్యధికంగా చూసిన చూసిన సినిమా ఏంటో తెలుసా..? 3 ఇడియట్స్. ఆమిర్ ఖాన్, మాధవన్, షర్మన్ జోషీ, కరీనా కపూర్, బొమన్ ఇరానీ, ఓమీ వైద్య తదితరులు ప్రధాన పాత్రల్లో రాజ్కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపిన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ.. ”దశాబ్దం క్రితం మేము ఎంతో ఇష్టపడి చేసిన 3 ఇడియట్స్ ఇప్పటికీ అందరి మన్ననలు పొందుతుండం సంతోషంగా ఉంది” అని అన్నారు.
కాగా విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద రూ.460కోట్లు కలెక్ట్ చేసి.. అక్కట్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. కాగా ఈ మూవీ వచ్చి 11 సంవత్సరాలు కాగా.. ఇప్పటికీ అమెరికాలో క్రేజ్ తగ్గకపోవడం విశేషం. మరోవైపుప్రపంచంలో అత్యధిక మంది చూసిన సినిమా లిస్ట్లో భారత్ నుంచి ఇప్పటికీ 3 ఇడియట్స్ మాత్రమే ఉండటం గమనించిదగ్గ విషయం.
Read This Story Also: మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: క్రికెటర్ షమీ