‘ఆచార్య’లో చెర్రీ పాత్రపై కొనసాగుతున్న డైలమా..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న 'ఆచార్య'లో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చిరంజీవి కూడా వెల్లడించారు. ఆ పాత్రకు చెర్రీనే కరెక్ట్ సరిపోతాడని తనకు అనిపించిందని, ఈ విషయాన్ని కొరటాల దగ్గర ప్రస్తావిస్తే ఆయన కూడా తన చాయిస్కే ఓటు వేశారని చిరు ఓ సందర్బంలో వెల్లడించారు. అయితే ఫిలింనగర్ తాజా సమాచారం ప్రకారం చెర్రీ ఈ సినిమాలో నటించడంపై ఇంకా డైలమా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను మళ్లీ సెట్స్ పైకి తీసుకెళ్లే ముందే చిరు, చెర్రీలపై టెస్ట్ షూట్ చేయాలని కొరటాల భావిస్తున్నారట. ఇక ఆ షూటింగ్లో సంతృప్తి చెందితేనే చెర్రీని ఈ సినిమాలో పెట్టుకోవాలని కొరటాల అనుకుంటున్నారట. ఒకవేళ సరిపోకపోతే మరో స్టార్ హీరోతో ఈ పాత్రను చేయించాలని ఆయన ఆలోచిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా సామాజిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి రెండు పాత్రలో నటించబోతున్నారు. నక్సలైట్గా, ప్రొఫెసర్గా ఆయన కనిపించనున్నారు. చిరు సరసన కాజల్ మరోసారి జత కట్టబోతోంది. సోనూసూద్, అజయ్, హిమజ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
Read This Story Also: తెలంగాణలో నేడు తెరుచుకోనున్న ప్రార్థనా మందిరాలు.. మార్గదర్శకాలివే..!