గ్రామంలో ప్రధాన సమస్యలైన కరెంట్, సెల్ నెట్వర్క్, రవాణా సౌకర్యాలపై కలెక్టర్ వెంటనే స్పందించారు. తరచూ విద్యుత్ నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఈఈని ఆదేశించగా, సెల్ టవర్ నిర్మాణం కోసం స్థలం కేటాయించి నెట్వర్క్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఆధార్ కార్డులు లేని వారికి వెంటనే కొత్త ఆధార్ల నమోదు పూర్తి చేయాలని ఇడిఎం, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అలాగే మారుమూల మామిడికోరి గ్రామానికి రోడ్డు (CD వర్క్) సౌకర్యం, జలసిరి కింద రైతులకు ఫార్మ్ పాండ్స్, అర్హులకు చేయూత పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దివ్యా దేవరాజన్ గుర్తుగా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలి సమీపంలోని గూడానికి ‘దివ్యగూడ’ అని పేరు పెట్టుకున్నారు. అప్పుడు దివ్య దేవరాజన్ కు ఇప్పుడు రాజార్షి షా కు.. ఓ కలెక్టర్ కు ఇంతకు మించిన గౌరవం ఇంకేం ఉంటుంది. శభాష్ కలెక్టర్లు అంటే మీలానే ఉండాలి.. ప్రజలతో ప్రజల కోసం ప్రజల మధ్య ప్రజా పాలన అందించేందుకు.