AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: డీఎంకే నాయకురాలు, ఎంపీ కనిమొళికి కరోనా.. ఆందోళనలో పార్టీ శ్రేణులు

Tamil Nadu Election 2021: తమిళనాడులో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. పదేళ్లు అధికారానికి దూరమైన పార్టీని ఎలాగైనా.. గట్టెక్కించాలని

Coronavirus: డీఎంకే నాయకురాలు, ఎంపీ కనిమొళికి కరోనా.. ఆందోళనలో పార్టీ శ్రేణులు
Kanimozhi Karunanidhi
Shaik Madar Saheb
|

Updated on: Apr 03, 2021 | 11:15 PM

Share

Tamil Nadu Election 2021: తమిళనాడులో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. పదేళ్లు అధికారానికి దూరమైన పార్టీని ఎలాగైనా.. గట్టెక్కించాలని డీఎంకే శ్రమిస్తోంది. ఓ వైపు ఎంకే స్టాలిన్, మరోవైపు కనిమొళి ప్రణాళికలు రచిస్తూ.. ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కనిమొళి అనారోగ్యానికి గురికావడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. డీఎంకే స్టార్ క్యాంపెయినర్ కనిమొళి కరోనావైరస్‌ బారిన పడ్డారు. తాజాగా ఆమె కరోనా పరీక్షలు చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్‌‌గా తేలింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారని పార్టీ నేతలు పేర్కొన్నారు. దాంతో ఎన్నికల ప్రచారంతో సహా అన్ని కార్యక్రమాలను కనిమొళి రద్దు చేసుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం కనిమొళి తూత్తుకుడి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తన సోదరుడు డీఎంకే అధినేత స్టాలిన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు కనిమొళి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ.. కనిమొళి కరోనా బారిన పడటంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6 న ఒకే దశలో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 2 న జరుగుతుంది.

తమిళనాడులో కరోనావైరస్ విజృంభిస్తోంది. రెండో దశలో రోజూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతేడాది అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రం అంతటా ఆందోళన నెలకొంది. తాజాగా శనివారం తమిళనాడులో 3,446 కోరోనా కేసులు నమోదయ్యాయి. 14 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Also Read:

Battle for Bengal: నాలుగో దఫాలో 60 శాతం కొత్తముఖాలతో పోటీకి తృణమూల్..కులాల లెక్కలతో బీజేపీ పోటీకి రె’ఢీ’!

Corona: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. 24గంటల్లో అరలక్ష మార్కుకు చేరువలో కేసులు..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు