బ్రేకింగ్: పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఘోరం చోటుచేసుకుంది. ఒంటిపై పెట్రోలు పోసుకొని లోకేశ్వరి అనే మహిళ నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ అనే వ్యక్తి మోసం చేశాడని మనస్తాపంతో ఆమె ఈ చర్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రవీణ్ తనను మోసం చేశాడని ఆమె ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఘోరం చోటుచేసుకుంది. ఒంటిపై పెట్రోలు పోసుకొని లోకేశ్వరి అనే మహిళ నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ అనే వ్యక్తి మోసం చేశాడని మనస్తాపంతో ఆమె ఈ చర్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రవీణ్ తనను మోసం చేశాడని ఆమె ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.



