ఉట్నూరులో నాటు బాంబు పేలుడు.. ముక్కలైన వ్యక్తి..
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతం నాటు బాంబు పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతుడి శరీరం చెల్లాచెదురుగా పడిపోయింది. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ మహారాష్ట్ర యావత్మాల్ జిల్లా చెందిన వారిగా తెలుస్తోంది. అర్లీ ప్రాంతం నుంచి ఆదిలాబాద్ మీదుగా ఉట్నూర్ మండలం గాదిగూడకు వెళ్తుండగా ఈ పేలుడు సంభవించింది. పేలుడు […]
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతం నాటు బాంబు పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతుడి శరీరం చెల్లాచెదురుగా పడిపోయింది. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ మహారాష్ట్ర యావత్మాల్ జిల్లా చెందిన వారిగా తెలుస్తోంది. అర్లీ ప్రాంతం నుంచి ఆదిలాబాద్ మీదుగా ఉట్నూర్ మండలం గాదిగూడకు వెళ్తుండగా ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు మృతుడి శరీరభాగాలు తునకాతునకలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలం నుంచి నాలుగు పేలని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అయితే అడవి పందులను వేటాడేందుకు ఈ నాటు బాంబులు తరలిస్తున్నట్లు వెల్లడైంది. పోలీసులు చెక్ పోస్టుల వద్ద తనిఖీ చేస్తారన్న భయంతో.. ఆ నాటుబాంబులను.. ఓ వ్యక్తి అండర్వేర్లో పెట్టుకున్నాడు. దీంతో అవి పేలి అక్కడిక్కడే చనిపోయాడు.