AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్రపోతున్న భార్య, ఇద్దరు కూతుర్లపై యాసిడ్‌ పోసిన దుర్మార్గుడు! కారణం ఏంటంటే..?

ఉత్తరప్రదేశ్ షాజహాన్ పూర్ లోని తిక్రి గ్రామంలో భర్త తన నిద్రిస్తున్న భార్య, ఇద్దరు కుమార్తెలపై యాసిడ్ దాడి చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం అనుమానంతో రామ్ గోపాల్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. గాయపడిన ముగ్గురు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నిద్రపోతున్న భార్య, ఇద్దరు కూతుర్లపై యాసిడ్‌ పోసిన దుర్మార్గుడు! కారణం ఏంటంటే..?
Acid Attack
SN Pasha
|

Updated on: Apr 20, 2025 | 3:04 PM

Share

నిద్రిస్తున్న తన భార్య, ఇద్దరు కుమార్తెలపై యాసిడ్‌ పోసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని తిక్రి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రామ్ గోపాల్ తన భార్య రామ్‌గుణికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు.

గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి తన 39 ఏళ్ల భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు 23 ఏళ్ల రచిత, 16 ఏళ్ల నేహా నిద్రిస్తున్న సమయంలో దాడి చేశాడు. ముగ్గురికీ తీవ్ర కాలిన గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏఎస్పీ దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రామ్‌గుణి తన పిల్లలతో కలిసి తిక్రి గ్రామంలోని అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె భర్త హర్డోయ్‌లోని షహాబాద్‌లో ఉంటున్నాడు. రామ్ గోపాల్‌కు మద్యం సేవించే అలవాటున్నాడని, తన వ్యసనాన్ని కొనసాగించడానికి షహాబాద్‌లోని తన వ్యవసాయ భూమిని అమ్మేశాడని పోలీసులు తెలిపారు.

తరచూ గొడవలు, భార్యపై అనుమానంతో భార్యభర్తలు వేరేవేరుగా జీవిస్తున్నారు. రామ్‌గుణి పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే తన భార్య వేరే వ్యక్తితో వివాహేత సంబంధం పెట్టుకుందని రామ్‌ గోపాల్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడు. దాడి తర్వాత అతను పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. అయితే దాడి జరిగిన సమయంలో రామ్‌గుణి, రామ్‌ గోపాల్‌ కుమారుడు అషు ఇంట్లో లేడు. దాడి చేసిన తన తండ్రిపై అతనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం