AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రాణం తీసిన వేగం.. మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు దుర్మరణం..

కర్ణాటకకు చెందిన మోహిన్ (23), ఒబేద్ (22) ఎర్రమంజిల్‌ నుంచి ఖైరతాబాద్‌ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ సమయంలో సోమాజిగూడ హనుమాన్‌ దేవాలయం ఎదురుగా ఉన్న మెట్రో పిల్లర్‌ను వేగంగా ఢీకొట్టారు.

Hyderabad: ప్రాణం తీసిన వేగం.. మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరు దుర్మరణం..
Accident
Shaik Madar Saheb
|

Updated on: Jul 15, 2022 | 10:30 AM

Share

Road Accident in Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అతి వేగంతో మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం కర్ణాటకకు చెందిన మోహిన్ (23), ఒబేద్ (22) ఎర్రమంజిల్‌ నుంచి ఖైరతాబాద్‌ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ సమయంలో వేగంగా వేళ్తూ సోమాజిగూడ హనుమాన్‌ దేవాలయం ఎదురుగా ఉన్న మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ హైదరాబాద్ బంధువుల ఇంటికి వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుల బంధువులకు సమాచారం అందించామని వారు వచ్చిన అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్