Crime News: ప్రేమ గుడ్డి వాడిని చేసింది.. పెళ్లి తిరస్కరించిన యువకుడిపై యాసిడ్‌ పోసిన వివాహిత!

కేరళలో దారుణం జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానంటూ నిరాకరించిన యువకుడి ముఖంపై యాసిడ్‌ పోసిన మహిళను ఆదిమాలి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Crime News:  ప్రేమ గుడ్డి వాడిని చేసింది.. పెళ్లి తిరస్కరించిన యువకుడిపై యాసిడ్‌ పోసిన వివాహిత!
Woman Attacks Youth With Acid
Follow us

|

Updated on: Nov 21, 2021 | 7:32 AM

Woman Attacks Youth with Acid: కేరళలో దారుణం జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానంటూ నిరాకరించిన యువకుడి ముఖంపై యాసిడ్‌ పోసిన మహిళను ఆదిమాలి పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరువనంతపురంలోని పూజపురకు చెందిన అరుణ్‌కుమార్ (27) అనే యువకుడిపై ఓ మహిళ యాసిడ్‌ పోసిన ఘటనలో అతడికి కంటి చూపు పోయింది. ఈ ఘటనకు సంబంధించి ఆదిమాలి పట్టణానికి చెందిన షీబా (35) అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. యాసిడ్ దాడికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ పోలీసులు విడుదల చేశారు. అయితే వీరిద్దరూ గత కొంతకాలంగా చనువు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నవంబర్ 16న ఇడుక్కి జిల్లా ఆదిమాలి సమీపంలోని ఇరుంపుపాలెం వద్ద సెయింట్ ఆంటోనీ చర్చి ముందు ఈ ఘటన జరిగింది. ఆదిమాలి పోలీసులు శనివారం సాయంత్రం ఆదిమాలిలోని వాలారా సమీపంలోని పడిక్కత్‌కు చెందిన షీబా (35)ను అరెస్టు చేశారు. అరుణ్‌పై షీబా వెనుక నుంచి యాసిడ్‌తో దాడి చేసినట్లు సీసీటీవీ విజువల్స్‌లో వెల్లడైంది. పరిస్థితిని గమనించిన తర్వాత, ఆమె సంఘటన స్థలం నుండి నెమ్మదిగా జారుకుంది. దాడి సమయంలో అతనితో పాటు ఉన్న అతని స్నేహితులు కూడా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆదిమాలిలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం వైద్య కళాశాలకు తరలించారు.

పోలీసులు నివేదికల ప్రకారం,తిరువనంతపురం జిల్లాలో షీబా హోమ్‌ నర్సుగా పనిచేస్తుండగా అరుణ్‌కుమార్‌తో సోషల్‌ మీడియాలో పరిచయం ఏర్పడింది. అదీ కాస్త ప్రేమకు దారితీసింది. షీబాకు పెయింటర్‌గా పనిచేస్తున్న సంతోష్‌తో పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత ఆ యువకుడు ఆ సంబంధం నుంచి తప్పుకున్నాడు. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ అరుణ్‌ను తరుచు కలుస్తూ ఉండేది. అనంతరం అతడిని బ్లాక్ మెయిల్ చేసి రూ.2 లక్షలు డిమాండ్ చేసింది.

అయితే, అరుణ్‌కుమార్‌ మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలియడంతో అతడిని ఆదిమలికి పిలిపించింది. ఈ విషయమై చర్చించేందుకు ఆదిమాలి రావాలని అరుణ్‌ని కోరింది. ఈ క్రమంలో అక్కడికి తన స్నేహితుడితో కలిసి వచ్చిన అరుణ్‌పై యాసిడ్‌‌తో దాడి చేసింది. అతడి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. షీబాను ఆమె భర్త ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. దాడిలో ఆమె చేతులపై యాసిడ్ పడడంతో ఆమె కూడా కాలిన గాయాలకు గురైంది. రబ్బరు గడ్డకట్టడానికి ఉపయోగించే యాసిడ్‌ను ఆమె తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు.

Read Also…  TDP Leader Arrest: అర్థరాత్రి హైడ్రామా.. టీడీపీ మరో ముఖ్య నేత అరెస్ట్.. ఎక్కడికి తీసుకెళ్లారంటే..?

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు