AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

East Godavari: రొయ్యల చెరువులో దొంగలు పడ్డారు.. కట్ చేస్తే మాములు ట్విస్ట్ కాదు…

దొంగలు అప్ డేట్ అయ్యారు.. దొంగలు అప్ డేట్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా... ఎక్కడైనా ఇళ్ళు ,షాపులు, గుళ్లల్లో దొంగతనాలు చేస్తారు. అయితే ఒక చోట ఆక్వా...

East Godavari: రొయ్యల చెరువులో దొంగలు పడ్డారు.. కట్ చేస్తే మాములు ట్విస్ట్ కాదు...
Shrimp Theft
Ram Naramaneni
|

Updated on: Jul 08, 2021 | 8:35 PM

Share

దొంగలు అప్ డేట్ అయ్యారు.. దొంగలు అప్ డేట్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా… ఎక్కడైనా ఇళ్ళు ,షాపులు, గుళ్లల్లో దొంగతనాలు చేస్తారు. అయితే ఒక చోట ఆక్వా చెరువులో రొయ్యలు దొంగతనం చేసారు.. ఇది ఎక్కడ సుమి అనుకుంటున్నారా..? అయితే ఫుల్ డిటేల్స్ వివరిస్తాం పదండి. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు నామాలవారి పాలెంలో విచిత్ర దొంగతనం జరిగింది. అమలాపురం రూరల్ జనుపల్లికి చెందిన నల్లా రామ్మూర్తి, గొర్తి విశ్వేశ్వర వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి కి చెందిన ఎనిమిది ఎకరాల రొయ్యల చెరువులో అర్దరాత్రి దొంగలు పడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా రొయ్యలను పట్టుకుని ఆటోలో ఎస్కేప్ అయ్యేందుకు సిద్దమయ్యారు దుండగులు. అది గమనించిన పోలీసులు వారిని వెంబడించించారు. అమలాపురం రూరల్ మండలం బండారులంక వద్ద అయిదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇక్కడ అసలు ట్విస్ట్‌ ఏంటంటే. ఆక్వా చెరువు కాపలాదారుడే దొంగతనంలో అసలు సూత్రదారిగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిందితులపై కేసు నమోదు చేపి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

పోలీసు ఇంట్లో చోరీ.. కట్ చేస్తే…

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఓ పోలీసు ఇంట్లో దొంగతనం జరిగింది. బంగారం, వెండి నగలు, వస్తువులు ఎత్తుకెళ్లాడు  దొంగ. కానీ పోతూ పోతూ తనను క్షమించమంటూ ఓ లెటర్ రాసి వెళ్లాడు.  భిండ్ సిటీలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ కమలేశ్ కటారే కుటుంబం భిండ్‌లో నివాసం ఉంటోంది. అయితే జూన్ 30న కమలేశ్ భార్య, అతడి పిల్లలు ఓ కజిన్ ఇంట్లో పెండ్లి ఉంటే వెళ్లారు. తిరిగి సోమవారం రాత్రి ఇంటికి రాగా లోపలి గది తాళాలు పగలిపోయి ఉండడం గమనించారు. బీరువాలోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందులోని గోల్డ్ ఆర్నమెంట్స్, వెండి వస్తువులు లేవని కమలేశ్ భార్య గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఇళ్లంతా గాలించి, క్లూస్ సేకరిస్తుండగా దొంగ రాసిన లెటర్ తారసపడింది. ‘‘సారీ ఫ్రెండ్, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ దొంగతనం చేయాల్సి వచ్చింది. నేను ఈ పని చేయకపోతే నా స్నేహితుడి  ప్రాణం పోతుంది. ఓ నిండు ప్రాణం కాపాడడానికి ఈ దొంగతనం చేశాను” అని అందులో రాసి ఉంది. అయితే భయం అక్కర్లేదని, డబ్బు రాగానే తిరిగి ఇచ్చేస్తానని ఆ దొంగ అందులో రాయడం గమనార్హం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Also Read: ఇంటి వెనుక పెరట్లో ముత్యాలు పండిస్తున్న రైతు.. ఏకంగా లక్షలు అర్జిస్తున్నాడు..

 తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తోన్న పిడుగులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి