AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం కష్టాలు.. వైన్‌ షాప్‌కు కన్నెం.. మందు బాటిళ్ల చోరీ..!

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అమ్మకాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడా మందు దొరికే పరిస్థితి లేదు.

మద్యం కష్టాలు.. వైన్‌ షాప్‌కు కన్నెం.. మందు బాటిళ్ల చోరీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 02, 2020 | 7:21 PM

Share

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అమ్మకాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడా మందు దొరికే పరిస్థితి లేదు. ఈ క్రమంలో కొందరు తమ చేతివాటం చూపించారు. కర్ణాటకలోని దేవెనహల్లిలో వైన్‌ షాప్‌కు కన్నెం వేశారు. దాదాపు లక్ష రూపాయలు విలువ చేసే మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. రోజు ఉదయం ఆ షాపులో లైట్లు ఆఫ్ చేసేందుకు క్యాషియర్ వెళ్లగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

విశ్వనాథపురలో ఉన్న ఓ వైన్ షాపులో శివు అనే క్యాషియర్ పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఆ వైన్ షాప్ మూత పడగా.. రోజు సాయంత్రం వేళ శివు వచ్చి లైట్లను ఆన్‌ చేసి, ఉదయం మళ్లీ ఆఫ్‌ చేసి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం షాపుకు వెళ్లిన అతడికి దొంగతనం జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. లోపలికి వెళ్లి చూడగా.. వేరు వేరు బ్రాండ్లకు చెందిన 200 బాటిళ్లు చోరికి గురైనట్లు అతడు గుర్తించాడు. దీంతో స్థానిక పోలీసులకు శివు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు.

Read This Story Also: కరోనాపై పోరు.. ‘జీహెచ్‌ఎంసీ’ కార్మికులకు టాలీవుడ్ సెలబ్రిటీల బాసట..!