AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంపీ కేశినేనిపై కేసు న‌మోదు..

క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు వెంటాడుతోన్న స‌మ‌యంలో ఎంతోమంది బ‌య‌ట‌కు వ‌చ్చి పూట గ‌డ‌వ‌నివారికి, వ‌ల‌స కూలీల‌కు సాయం చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం లాక్ డౌన్ అమ‌ల‌వుతున్నందున స‌రై‌న జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే..సాయం కంటే ఎక్కువ డ్యామేజ్ జ‌రిగే ప్ర‌మాదం ఉంది. దీంతో అధికారులు, పోలీసులు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఎంపీ కేశినేని నాని లాక్ డౌన్ రూల్స్ అతిక్ర‌మించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విజయవాడ న‌గ‌ర‌ వెస్ట్ జోన్ ఏసీపీ శనివారం […]

ఎంపీ కేశినేనిపై కేసు న‌మోదు..
Ram Naramaneni
|

Updated on: May 03, 2020 | 2:35 PM

Share

క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు వెంటాడుతోన్న స‌మ‌యంలో ఎంతోమంది బ‌య‌ట‌కు వ‌చ్చి పూట గ‌డ‌వ‌నివారికి, వ‌ల‌స కూలీల‌కు సాయం చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం లాక్ డౌన్ అమ‌ల‌వుతున్నందున స‌రై‌న జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే..సాయం కంటే ఎక్కువ డ్యామేజ్ జ‌రిగే ప్ర‌మాదం ఉంది. దీంతో అధికారులు, పోలీసులు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఎంపీ కేశినేని నాని లాక్ డౌన్ రూల్స్ అతిక్ర‌మించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విజయవాడ న‌గ‌ర‌ వెస్ట్ జోన్ ఏసీపీ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ నెల 1వ తేదీన ఉదయం విజయవాడ నగరంలోని 2వ పట్టణ పీఎస్ పరిధిలో 47వ డివిజన్‌లోని గుజ్జారి యల్లారావు కూరగాయల మార్కెట్ ఎదురుగా టీడీపీ ఎంపీ కేశినేని నానితో పాటు ఆయ‌న అనుచ‌రులు కొంద‌రు గ‌వ‌ర్న‌మెంట్ రూల్స్ పాటించ‌లేద‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. కనీస భౌతిక‌ దూరం పాటించకుండా పెద్ద ఎత్తున్న ప్రజలను జమచేసి ప్రాణాంతక కరోనా వ్యాధి వ్యాప్తి చెందే విధంగా ప్రవర్తించి కూరగాయల పంపిణీ చేశారని ఏసీపీ పేర్కొన్నారు. కాబట్టి, ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి కరోనా వ్యాప్తి చెందేందుకు కారణమైన వారందరిపై విజయవాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ నుందు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

అయితే విజయవాడ సిటి పోలీసులకు ఎంపీ కేశినేని తీవ్రంగా ఫైర‌య్యారు. తిండి లేక అలమటిస్తున్న పేదలకు సహాయం చేస్తునందుకు విజ‌య‌వాడ పోలీసులు దొంగ కేసులు బ‌నాయిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవడాన్ని ఆపేది లేదని స్ప‌ష్టం చేశారు. ప్రజలు ఎన్నుకుంది వారు ఆపదలో ఉన్నపుడు ఇంట్లో కూర్చోవడానికి కాదని చుర‌క‌లంటించారు.

Follow Us
ఇండియాలో డిజిటల్ విప్లవం: టెలికాంలో చరిత్రాత్మక మైలురాయి
ఇండియాలో డిజిటల్ విప్లవం: టెలికాంలో చరిత్రాత్మక మైలురాయి
అంతరిక్షంలో రిపేర్లకు రెడీ అవుతున్న ఆస్ట్రోనాట్లు
అంతరిక్షంలో రిపేర్లకు రెడీ అవుతున్న ఆస్ట్రోనాట్లు
వట పౌర్ణమి జూన్ 29నా? 30నా? సరైన తేదీ ఇదే.. వ్రత విశిష్టత, పూజా..
వట పౌర్ణమి జూన్ 29నా? 30నా? సరైన తేదీ ఇదే.. వ్రత విశిష్టత, పూజా..
తెలుగు రాష్ట్రాలకు కరువు ముప్పు.. డెడ్ స్టోరేజ్‌కు చేరిన ప్రాజెక్
తెలుగు రాష్ట్రాలకు కరువు ముప్పు.. డెడ్ స్టోరేజ్‌కు చేరిన ప్రాజెక్
గ్యాస్ స్టవ్ పక్కనే వంట నూనె పెడుతున్నారా? నిపుణుల హెచ్చరిక!
గ్యాస్ స్టవ్ పక్కనే వంట నూనె పెడుతున్నారా? నిపుణుల హెచ్చరిక!
శనివారాల్లో నూనె స్నానం చేస్తే ఏమవుతుంది? శని అనుగ్రహంతో పాటు..
శనివారాల్లో నూనె స్నానం చేస్తే ఏమవుతుంది? శని అనుగ్రహంతో పాటు..
ఇలాంటి బంగాళాదుంపలు తింటున్నారా..? మీ ఆరోగ్యం బంగాళాఖాతమే..!
ఇలాంటి బంగాళాదుంపలు తింటున్నారా..? మీ ఆరోగ్యం బంగాళాఖాతమే..!
కేవలం రూ.50 వేలతోనే అద్భుతమైన వ్యాపారం.. లక్షల్లో ఆదాయం..!
కేవలం రూ.50 వేలతోనే అద్భుతమైన వ్యాపారం.. లక్షల్లో ఆదాయం..!
బిగ్ షాక్.. చిత్తుగా ఓడిన టీమిండియా!
బిగ్ షాక్.. చిత్తుగా ఓడిన టీమిండియా!
రోజూ బ్లూబెర్రీస్ తింటే శరీరంలో జరిగేది ఇదే? సైన్స్ చెబుతున్న మాట
రోజూ బ్లూబెర్రీస్ తింటే శరీరంలో జరిగేది ఇదే? సైన్స్ చెబుతున్న మాట