కరోనాపై పోరు.. ‘జీహెచ్ఎంసీ’ కార్మికులకు టాలీవుడ్ సెలబ్రిటీల బాసట..!
కరోనాపై పోరుకు డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా చేస్తోన్న సేవ మాటల్లో తెలిపేది కాదు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు సేవలను అందిస్తున్నారు.
కరోనాపై పోరుకు డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా చేస్తోన్న సేవ మాటల్లో తెలిపేది కాదు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు సేవలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులకు బాసటగా నిలిచారు టాలీవుడ్ ప్రముఖులు. జీహెచ్ఎంసీ పరిధిలోని కార్మికులకు 1500 ఫేస్ షీల్డ్స్ను అందించారు(కరోనా వైరస్ బారిన పడకుండా ముఖానికి ఈ షీల్డ్స్ను వాడుతుంటారు). ఈ బృహత్తర కార్యక్రమంలో రానా, అల్లు శిరీష్, నవదీప్, మంచు లక్ష్మీ భాగం అయ్యారు. ఈ విషయాన్ని ద పాండమిక్ రెస్పాన్స్ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కరోనాపై పోరాటం చేస్తోన్న జీహెచ్ఎంసీ యోధుల కోసం టాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చి ఫేస్ షీల్డ్స్ను అందించి స్పూర్తిగా నిలిచారు. వారందరికీ కృతఙ్ఞతలు అని ఆ టీమ్ పేర్కొంది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఈ టీమ్ నిధులను సమకూరుస్తూ కరోనా వారియర్స్కు సేవలను అందిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు లాక్ డౌన్ నేపథ్యంలో సినీ కార్మికుల కోసం కూడా టాలీవుడ్ ప్రముఖులు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన సీసీసీ ద్వారా సినీ కార్మికులకు నిత్యావసర సరకులను అందిస్తున్నారు.
Read This Story Also: చెర్రీ కోసం కొరటాల మరో నిర్ణయం..!
https://www.instagram.com/p/B_nCIOeFcId/?utm_source=ig_embed