AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: ఉద్యోగం ఇప్పిస్తానని ₹200 మోసం… 30 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్!

ర్ణాటక రాష్ట్రం కార్వార సమీపంలోని శిరసికి చెందిన ఓ వ్యక్తిని మూడు దశాబ్దాల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక యువకుడి నుంచి మూడు దశాబ్దాల క్రితం రూ.200 తీసుకుని కేశవమూర్తిరావు (55) పరారయ్యాడు. శిరసికి చెందిన...

Karnataka: ఉద్యోగం ఇప్పిస్తానని ₹200 మోసం... 30 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్!
Job Fraud Arrest
K Sammaiah
|

Updated on: Jul 08, 2025 | 9:47 AM

Share

కర్ణాటక రాష్ట్రం కార్వార సమీపంలోని శిరసికి చెందిన ఓ వ్యక్తిని మూడు దశాబ్దాల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక యువకుడి నుంచి మూడు దశాబ్దాల క్రితం రూ.200 తీసుకుని కేశవమూర్తిరావు (55) పరారయ్యాడు. శిరసికి చెందిన వెంకటేశ మహదేవ వైద్య నుంచి నగదు తీసుకుని వంచించారని కేశవమూర్తిపై కేసు నమోదైంది.

ఈ కేసులో కార్వార ఠాణా పోలీసులు కేశవమూర్తిని అరెస్టు చేశారు. ఆయన ఇదే తరహాలో పలువురి నుంచి నగదు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న నిందితుడు తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడని తెలుసుకున్న పోలీసులు సోమవారం అరెస్టు చేశారు

ఉత్తర కన్నడ జిల్లా శరసి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో 1990లో జరిగిన మోసపు కేసులో 30 ఏళ్ల తర్వాత నిందితుడు పోలీసులకు చిక్కాడు. బి.కె. రామచంద్రరావు అనే వ్యక్తి, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ బాధితుడి నుంచి ₹200 తీసుకుని మోసం చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసు నమోదు అయినప్పటికీ నిందితుడు కోర్టుకు హాజరుకాకుండా పరారీలో ఉన్నాడు. దీంతో, DYSP గీతా పాటీల్ మార్గదర్శనంలో, శిరసి గ్రామీణ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మంజునాథ్ ఎం, PSI సంతోష్ కుమార్ ఎం, శోక్ రాఠోడ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటై నిందితుడి కోసం గాలించింది.

బెంగళూరులోని ಬళేపేట ప్రాంతంలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ అరెస్ట్‌ ఆపరేషన్‌లో పోలీస్ సిబ్బంది రాఘవేంద్ర ಜಿ, మారుతి గౌడ కూడా పాల్గొన్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.