AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Accident: ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన ట్రైన్.. స్పాట్‌లోనే..

రైలు ప్రమాదాలు ప్రజలను భయపెడుతున్నాయి. 2014లో మాసాయిపేటలో స్కూల్ వ్యాన్‌ను ట్రైన్ ఢీకొట్టగా.. 15మందికి పైగా చిన్నారులు మరణించారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన అందరినీ కలిచివేసింది. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. రైల్వే గేట్ క్రాస్ చేస్తున్న స్కూల్ వ్యాన్‌ను ట్రైన్ ఢీకిట్టింది.

Train Accident: ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన ట్రైన్.. స్పాట్‌లోనే..
Tamilnadu Train
Krishna S
|

Updated on: Jul 08, 2025 | 9:22 AM

Share

రైలు ప్రమాదాలు ప్రజలకు భయాందోళనను కలిగిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కోరమండల్ ఎక్స్‌ప్రెస్  ప్రమాదంలో 300 మందికి పైగా మరణించడం అందరినీ కలిచివేసింది. ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట  రైలు పట్టాలు తప్పిన ఘటనల గురించి వింటూనే ఉన్నాం. 2014లో మాసాయిపేటలో స్కూల్ వ్యాన్‌ను ట్రైన్ ఢీకొట్టగా.. 15మందికి పైగా చిన్నారులు మరణించారు. ఈ ఘటన ఎంతో మంది తల్లిదండ్రుల ఆశలను, చిరునవ్వులను చిదిమేసింది. ఇప్పుడు మరోసారి అలాంటి దుర్ఘటనే చోటుచేసుకుంది. స్కూల్ వ్యాన్ పట్టాలు క్రాస్ చేస్తుండగా ట్రైన్ ఢీకొట్టింది. దీంతో వ్యాన్ ఎగిరి 10 మీటర్ల దూరంలో పడింది.

తమిళనాడులోని కడలూరులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. చెమ్మగుంపం వద్ద స్కూల్ వ్యాన్‌ రైల్వే గేట్ క్రాస్ అవుతుండగా.. వేగంగా వచ్చిన ట్రైన్ ఢీకొట్టింది. దీంతో బస్సు ఎగిరి 10మీటర్ల దూరంలో పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్థులు మరణించగా.. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో నలుగురు విద్యార్థులతో పాటు, డ్రైవర్, అసిస్టెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వస్తారనుకున్న బిడ్డలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.  రైలు వచ్చే సమయంలో గేట్ వేయకపోవడంతోనే ఈ పెను ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం ధాటికి వ్యాన్ మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.