అడగకుండానే సంబంధంలేని సొసైటీ నుంచి ఉదారంగా 24 కోట్ల రూపాయల మేర రుణాలిచ్చేశారు. ఇంతకీ ఏమా కథ, ఎక్కడీ బంపరాఫర్

ఉన్న ఊళ్లోనే కాళ్లరిగేలా తిరిగినా లోన్లివ్వరు. అలాంటిది అడక్కుండానే సంబంధంలేని సొసైటీ నుంచి ఉదారంగా కోట్ల రుణాలిచ్చేశారు. అయితే,..

అడగకుండానే సంబంధంలేని సొసైటీ నుంచి ఉదారంగా 24 కోట్ల రూపాయల మేర రుణాలిచ్చేశారు. ఇంతకీ ఏమా కథ, ఎక్కడీ బంపరాఫర్
YSR Pension Money
Follow us

|

Updated on: Feb 23, 2021 | 10:04 PM

ఉన్న ఊళ్లోనే కాళ్లరిగేలా తిరిగినా లోన్లివ్వరు. అలాంటిది అడక్కుండానే సంబంధంలేని సొసైటీ నుంచి ఉదారంగా కోట్ల రుణాలిచ్చేశారు. అయితే, ఆ సొమ్ములు మధ్యలో ఎవరో తినేశారు. లోన్‌ సంగతే తెలీనివారికి నోటీసులిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది 24 కోట్ల సొసైటీ స్కామ్‌. కట్ చేస్తే, చనిపోయినవాళ్లూ ఈ లోన్లు తీసుకున్నారు. ఎవరో తినేసిన సొమ్మును తిరిగి కట్టమని నోటీసులొస్తుంటే తెల్లమొహాలేస్తున్నారు. సహకారరంగంలో స్వాహాపర్వాన్ని కళ్లకుగట్టే స్కామ్‌ ఇది. పేర్లు మాత్రమే వాళ్లవి. లోన్లు తీసుకుంది ఎవరో తెలీదు. అప్పు చెల్లించాలని నోటీసులొస్తుంటే…మేం ఎక్కడ తీసుకున్నామంటూ సొసైటీకి క్యూ కడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి సొసైటీలో భారీ గోల్‌మాల్‌ ఆలస్యంగా వెలుగుచూసింది.

కోటీ రెండు కోట్లు కాదు..ఏకంగా 23 కోట్ల 85 లక్షలు. 2017 -2019 మధ్య జరిగిందీ కుంభకోణం. తొండంగి, రౌతలపూడి, శంఖవరం, ప్రత్తిపాడు మండలాల పరిధిలో ఈ అక్రమాలకు తెరలేచింది. డాక్యుమెంట్స్‌ డూప్లికేట్‌. చివరికి సబ్‌రిజిస్ట్రార్‌ సంతకం కూడా ఫోర్జరీనే. చనిపోయిన వారిని కూడా వదల్లేదు అక్రమార్కులు. పదేళ్లక్రితం చనిపోయినవారి పేర్లమీద కూడా లోన్లు సృష్టించారు. ఈ లోకంలో లేనివారికి కూడా నోటీసులు రావడంతో బాధితులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. తొండంగి మండలంలోని 61 మందికి అప్పులు తీర్చాలంటూ నోటీసులొచ్చాయి. వారంతా దాదాపు 10కోట్ల 73 లక్షల రుణాలు తీసుకున్నట్లు లెక్కలున్నాయి.

ఎక్కడో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న గండేపల్లి సహకారబ్యాంక్‌కి, తొండంగి రైతులకు సంబంధమే లేదు. అయినా సొసైటీ నుంచి అప్పు ఎప్పుడు చెల్లిస్తారంటూ ఫోన్లు. త్వరగా కట్టకపోతే చర్యలుంటాయంటూ నోటీసులు. దీంతో అసలు ఆ పేర్లపై ఎప్పుడూ లోన్లే తీసుకోలేదంటూ తమ దగ్గరే ఉన్న పాస్‌పుస్తకాలు చూపిస్తున్నారు కుటుంబసభ్యులు. రైతుల పేరిట దొంగ పాస్‌బుక్కులు సృష్టించి లోన్లు దిగమింగినట్లు అనుమానిస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన ఈ భారీ స్కాంలో సొసైటీ ఉద్యోగులతో పాటు కొందరు నేతల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. లక్ష రూపాయల లోన్‌కే సవాలక్ష ప్రశ్నలేసే అధికారులు…గుడ్డిగా ఇన్ని కోట్ల రుణాలు ఎలా ఇచ్చారన్నదే మిలియన్‌ డాలర్ట ప్రశ్న.

Read also :

Janasena results : ఇవే మా ఫలితాలు, ఏపీ పంచాయతీ ఎన్నికలలో సాధించిన విజయాల్ని అధికారికంగా ప్రకటించిన జనసేన

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు