Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి.. 30 మందికి గాయాలు

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాహనాలు అజాగ్రత్తగా నడపడం, మద్యం తాగి నడపడం, ఓవర్‌టెక్‌ చేయడం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం ఆగడం లేదు. ప్రమాదాల్లో..

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి.. 30 మందికి గాయాలు
Road Accident
Follow us

|

Updated on: Jul 10, 2024 | 8:13 AM

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాహనాలు అజాగ్రత్తగా నడపడం, మద్యం తాగి నడపడం, ఓవర్‌టెక్‌ చేయడం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం ఆగడం లేదు. ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా బుధవారం ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్‌ బస్సును కంటైనర్‌ ఢీకొనడంతో 18 మంది మృతి చెందారు.

అలాగే 30 మంది వరకు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటన లక్నో-ఆగ్ర ఎక్స్‌ప్రెస్‌ హైవేపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి