AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: వజ్రాలు చోరీ చేసి..ఈ కేటుగాళ్లు ఎక్క‌డ దాచారో తెలుసా.. ప‌క్కా ప్లాన్

మధ్యప్రదేశ్ వారం క్రితం విలువైన ఐదు వ‌జ్రాల‌తో పాటు రూ.2.5 లక్షల నగదు చోరీ చేశారు దుండ‌గ‌లు. తాజాగా ఈ కేసును పోలీసులు చేధించారు. చింద్వాఢాకు...

Crime News: వజ్రాలు చోరీ చేసి..ఈ కేటుగాళ్లు ఎక్క‌డ దాచారో తెలుసా.. ప‌క్కా ప్లాన్
Diamonds Theft
Ram Naramaneni
|

Updated on: Jun 06, 2021 | 5:23 PM

Share

మధ్యప్రదేశ్ వారం క్రితం విలువైన ఐదు వ‌జ్రాల‌తో పాటు రూ.2.5 లక్షల నగదు, మరో 250 డైమండ్లు చోరీ చేశారు దుండ‌గ‌లు. తాజాగా ఈ కేసును పోలీసులు చేధించారు. చింద్వాఢాకు చెందిన ప్రిన్స్ సోని (25) అనే వ్యక్తి ఈ చోరీలో ప్రధాన నిందితుడని ఎస్పీ సిమలా ప్రసాద్ వెల్ల‌డించారు. సోని, అతని ముఠా మే 31న ఈ చోరీకి పాల్ప‌డిన‌ట్లు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఝార్ఖండ్​కు చెందిన కరణ్​ను అదుపులోకి తీసుకుని విచారించగా.. మొత్తం వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. నేరాన్ని అంగీరించిన అత‌డు స‌హ నిందితుల స‌మాచారం కూడా చెప్పేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సైఖేదా, పింటు నాగ్లే, శుభం గైక్వాడ్, పంకజ్ కావ్డే, హృతిక్ చంద్రహాస్, రోహిత్ మార్కంతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి రూ.55 లక్షలు విలువైన ఆభరణాలతో పాటు.. ఐదు మేలిమి వజ్రాలు, 250 డైమండ్లు, 2 నాటు తుపాకులు, రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు వ‌జ్రాలు దాచే విష‌యంలో అతి తెలివితో వ్య‌వ‌హరించారు. వాటిని ఔషధాలలో(క్యాప్సూల్స్‌) దాచి ఉంచారని ఎస్పీ వివరించారు.

Also Read : బెజ‌వాడ‌లో కిలాడీ లేడీ.. మాయ చేసి.. ముంచేస్తుంది…

మీ నీడ ఎప్పుడైనా మిస్ అయ్యిందా.. అక్క‌డ మాత్రం అలాగే జ‌రిగింది.. వ‌స్తువుల షాడోలు కూడా క‌నిపించ‌లేదు