Lakhimpur Kheri: లఖింపూర్ ఖేరీలో మరో దారుణం.. బైక్‌ను ఢీకొట్టిన బీజేపీ ఎమ్మెల్యే కారు.. అన్నదమ్ములిద్దరు మృతి!

ఇప్పటికే రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో మరో దారుణం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ ప్రయాణిస్తున్న స్కార్పియో కారు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఢీకొట్టింది.

Lakhimpur Kheri: లఖింపూర్ ఖేరీలో మరో దారుణం.. బైక్‌ను ఢీకొట్టిన బీజేపీ ఎమ్మెల్యే కారు.. అన్నదమ్ములిద్దరు మృతి!
Car Accident
Follow us

|

Updated on: Apr 18, 2022 | 10:26 AM

Lakhimpur Kheri Road Accident: ఇప్పటికే రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో మరో దారుణం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ ప్రయాణిస్తున్న స్కార్పియో కారు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన అనంతరం స్కార్పియో కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బహ్రైచ్ హైవేపై బైక్, కారు ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందినట్లు ఎస్పీ లఖింపూర్ ఖేరీ సంజీవ్ సుమన్ తెలిపారు. వాహనం ఎమ్మెల్యే యోగేష్ వర్మకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌తో పాటు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నాం. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

లఖింపూర్ బహ్రైచ్ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. రామాపూర్ సమీపంలో వేగంగా వచ్చిన నల్లటి స్కార్పియో బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో రవి (20), అతని బంధువు మనీష్ (22)లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇద్దరూ బైక్‌పై తమ ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కారు ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్కార్పియో కారు డ్రైవర్ మునేంద్రను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించడంతో పాటు విషయాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు తెలియజేశారు. అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

స్కార్పియో కారు సదరు ఎమ్మెల్యే యోగేష్ వర్మకు చెందినది. ఇది ఆయన భార్య నీలం వర్మ పేరు మీద రిజిస్టర్ అయ్యినట్లు పోలీసులు తెలిపారు. స్కార్పియో కారుతో ఘటన జరిగిన సమయంలో సదరు ఎమ్మెల్యే కారులో లేరని సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి అదనపు పోలీసు సూపరింటెండెంట్ అరుణ్ సింగ్ మాట్లాడుతూ, లఖింపూర్-బహ్రైచ్ రహదారిలోని రామాపూర్ సమీపంలో బైక్ – స్కార్పియో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. స్కార్పియో కారు డ్రైవర్ మునేంద్రకు లఖింపూర్ ఖేరీ సదర్ ఎమ్మెల్యే యోగేష్ వర్మతో అనుబంధం ఉంది. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Read Also…  Mother House Arrest: దారుణం.. ఇంటిలో వివస్త్రగా.. కన్నతల్లిని పదేళ్లు బంధించిన కర్కోటకులు..!