Tragedy: పరువు పోయిందని.. ఐదుగురు బలవన్మరణం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

Family Suicide: కర్ణాటకలోని కోలార్ పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. శిశువు విషయంలో అబద్దం ఆడిన ఓ కుటుంబం.. పరువు పోయిందనే బాధతో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో సోమవారం

Tragedy: పరువు పోయిందని.. ఐదుగురు బలవన్మరణం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
Crime News
Follow us

|

Updated on: Nov 10, 2021 | 12:03 PM

Family Suicide: కర్ణాటకలోని కోలార్ పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. శిశువు విషయంలో అబద్దం ఆడిన ఓ కుటుంబం.. పరువు పోయిందనే బాధతో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో సోమవారం ఓ కుటుంబంలోని ఐగుగురు విషం తాగి మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతులను మునియప్ప (75), నారాయణమ్మ (70), బాబు (45), గంగోత్రి (17), పుష్ప (33) గా గుర్తించారు. ఐదుగురు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోసూర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని.. కోలార్ పట్టణానికి చెందిన యువకుడు ఇద్దరు ప్రేమించుకున్నారు. చాలాకాలంపాటు సహజీవనం చేయగా.. ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆ యువతి భయపడి కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఆమె తండ్రి.. చాలాసార్లు ఇంటికి రావాలంటూ ఫోన్ చేసినా.. యువతి నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆయువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె తల్లికి చెప్పగా.. ఆమె కోలార్ కు వచ్చింది. తన కుమార్తె, మనవరాలితో కొన్ని రోజులు గడిపిన తర్వాత.. ఆ యువతి తల్లి తన గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ తరుణంలో యువతి తన తల్లికి తోడుగా వెళ్లాలని నిర్ణయించుకొని.. పొరుగున నివసించే కరంజికట్టా నివాసి అయిన పుష్పకు బిడ్డను అప్పగించి వెళ్లారు. మళ్లీ వచ్చి తీసుకుంటామని చెప్పడంతో పుష్పకూడా పిల్ల ఆలనాపాలనా చూసేందుకు ఒప్పుకుంది.

20 రోజుల తర్వాత ఇంటినుంచి వచ్చిన తరువాత 31న కోలార్‌కు తన పాపను ఇవ్వాల్సిందిగా ఆ యువతి పుష్పను కోరింది. అయితే.. తనకు ఎవ్వరినీ ఇవ్వలేదంటూ పుష్ప.. బిడ్డను ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో బాధిత యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి.. తనకు న్యాయం చేయాలని కోరింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన గల్‌పేట పోలీసులు మునియప్ప, ఆయన కుటుంబ సభ్యులను ఈ విషయంపై విచారించారు. సీసీ కెమెరాల్లో సైతం పిల్లను తీసుకున్నట్లు కనిపించింది. అయితే.. విచారణ జరుగుతున్న క్రమంలో తమ కుటుంబ పరువు పోయిందనే బాధతో ఐదుగురు విషం తాగారు. గమనించిన స్థానికులు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ముందు నలుగురు మృతి చెందగా.. అనంతరం చికిత్స పొందుతూ మునియప్ప కుమార్తె పుష్ప కూడా మరణించినట్లు గల్‌పేట పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Shocking Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 22 అంతస్తుల భవనం గోడపై ఇద్దరు చిన్నారులు ఏం చేశారంటే..?

Crime News: మంచినీళ్లు ఇవ్వాలంటూ ఇంట్లోకి వెళ్లి.. వృద్ధురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం..

నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!