AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చెక్‌ పోస్ట్‌ వద్ద ఖరీదైన కారు.. పోలీసుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానం.. అనుమానంతో తనిఖీ చేయగా..

Andhra Pradesh: పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా గంజాయి అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్టపడడం లేదు. చెక్‌ పోస్టుల ఏర్పాటు చేసినా రకరకాల మార్గాల్లో బార్డర్‌ దాటిచ్చేస్తున్నారు. తాజాగా ఈ అక్రమ రవాణాలో...

Andhra Pradesh: చెక్‌ పోస్ట్‌ వద్ద ఖరీదైన కారు.. పోలీసుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానం.. అనుమానంతో తనిఖీ చేయగా..
Representative Image
Narender Vaitla
|

Updated on: Jul 15, 2022 | 9:16 AM

Share

Andhra Pradesh: పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా గంజాయి అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్టపడడం లేదు. చెక్‌ పోస్టుల ఏర్పాటు చేసినా రకరకాల మార్గాల్లో బార్డర్‌ దాటిచ్చేస్తున్నారు. తాజాగా ఈ అక్రమ రవాణాలో ఏకంగా పోలీసు అధికారులే ఉన్నారన్న వార్త అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అల్లూరి జిల్లాలో వెలుగులోకి వచ్చిన సంఘటన డిపార్ట్‌మెంట్‌లో ఉన్న అక్రమార్కుల గురించి వెలుగులోకి వచ్చింది.

తాజాగా ముంచంగి పుట్టు మండలం లబ్బూరు వద్ద.. తనిఖీలు చేస్తున్న పోలీసులకు బొలెరో వాహనం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ఆపి ప్రశ్నించే సరికి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పొంతనలేని సమాధానం చెప్పారు. అనుమానం వచ్చి వెరిఫై చేసేసరికి వాహనంలో 560 కిలోల గంజాయి బయటపడింది. ఇద్దరిని అదుపుల్లో తీసుకుని విచారించేసరికి వారిలో ఒకర్ని ఒడిస్సాకు చెందిన కానిస్టేబుల్ ప్రమోద్‌ కుమార్‌గా గుర్తించారు. ఆరా తీస్తే స్మగ్లర్లతో చేతులు కలిపి గంజాయిని సరిహద్దులు దాటించేస్తున్నట్టు తేలింది. గతంలో మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన కానస్టేబుల్‌ జ్ఞానేశ్వర్ యోగేష్ పాడేరులో గంజాయిని తరలిస్తు పట్టుపడ్డాడు. అయితే.. గంజాయి కేసుల్లో చాలావరకు కూలీలే చిక్కుకునేవారు. అల్లూరు జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత.. అసలు నిందితులను ట్రాక్ చేసే పనిలోపడ్డారు పోలీసులు.

తాజాగా జీ మాడుగుల వద్ద కాపు కాసిన పోలీసులకు.. ఖరీదైన కార్లలో గంజాయిని ఢిల్లీకి తరలిస్తున్న ముఠా పట్టుబడింది. ఫోర్డ్ లాంటి కార్లలో.. వాహనం డోర్లలో కుక్కి ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తుంది ఈ ముఠా. నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఇటువంటి ఖరీదైన కార్లలో వచ్చే గంజాయి స్మగ్లర్లకు కూడా.. ఆయా రాష్ట్రాల్లోనే పోలీసుల సహకారం పరోక్షంగా ఉంటుందనేది అల్లూరు జిల్లా పోలీసులు అనుమానం. దీంతో ఈ మధ్యకాలంలో మరింత దూకుడు పెంచిన అల్లూరి పోలీసులు.. రెండు నెలల వ్యాధిలో పాడేరు సర్కిల్ పరిధిలో 25 కేసులను నమోదు చేశారు. దాదాపుగా 3000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. అంతర్రాష్ట్ర గంజాయి సోదరుల ముఠాలను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..