AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Crime News: కిడ్నాప్​కు గురైన ఆరేళ్ల బాలికను 24 గంటల్లోనే తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించిన పోలీసులు

Hyderabad Crime News: కిడ్నప్ కు గురైన బాలికను 23 గంటల్లోనే తిరిగి తల్లివద్దకు చేర్చారు హైదరాబాద్ పోలీసులు. మంగళవారం పురానిహవేలిలోని డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో..

Hyderabad Crime News: కిడ్నాప్​కు గురైన ఆరేళ్ల బాలికను 24 గంటల్లోనే తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించిన పోలీసులు
Hyderabad Crime News
Surya Kala
|

Updated on: Sep 15, 2021 | 8:00 AM

Share

Hyderabad Crime News: కిడ్నప్ కు గురైన బాలికను 23 గంటల్లోనే తిరిగి తల్లివద్దకు చేర్చారు హైదరాబాద్ పోలీసులు. మంగళవారం పురానిహవేలిలోని డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డిసిపి గజరావు భూపాల్ వివరాలను వెల్లడించారు. అంబర్​పేట్​ ఆలీకేఫ్​ ప్రాంతానికి చెందిన ముస్కాన్​ ఆలీ మీర్జా(41) తన కూతురు అల్ఫియా(6)తో కలిసి భిక్షాటన చేస్తుంది. కాగా ఈ నెల 13వ తేదీన ఉదయం 11గంటల సమయంలో చంచల్​గూడలో బిక్షాటన చేస్తుండగా ఓ మహిళ వాళ్ల దగ్గరికి వచ్చి తన పేరు ఫాతిమా అని హఫీజ్​బాబానగర్​లో ఓ స్వచ్చంద సేవా సంస్థ పెద్ద ఎత్తున బట్టలు, డబ్బు దానం (జకాత్​) ఇస్తుంటారని నమ్మబలికింది. వెంటనే వారిని ఆటోలో ఎక్కించుకుని హఫీజ్​బాబానగర్​కు చేరుకుంది. అక్కడే ఉన్న ఓ ఇంటిని మీర్జాకు చూపెట్టింది. ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్లి జకాత్​ తీసుకో అని మాయమాటలు చెప్పింది. ఆటో దిగి కాస్త ముందుకు మీర్జా వెళ్లగానే ఆరేళ్ల మైనర్​ బాలికతో ఆటోలో ఫాతిమా పరారయ్యింది.

మీర్జా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచన్​బాగ్​ పోలీసులు కేసును నమోదు చేసుకుని సంతోష్​నగర్​ డివిజన్​ ఏసీపీ శివరాం శర్మ పర్యవేక్షణలో ఐదు బృందాలను రంగంలోకి దింపారు. హఫీజ్​బాబానగర్​ నుంచి రెండు ఆటోలను మార్చుతూ ఫాతిమా బాలికతో శంషాబాద్​కు చేరుకుంది. అక్కడి నుంచి షాద్​నగర్​లోని సొంత ఇంటికి బాలికను కిడ్నాప్​ చేసి తీసుకువెళ్లినట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు గుర్తించారు. పోలీసులు వెంటనే ఫాతిమాగా చెప్పుకున్న ఆసియా బి(26) ను అదుపులోకి తీసుకుని కిడ్నాపర్​ చెర నుంచి బాలికకు విముక్తి కలిగించారు. శంషాబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆసియాబి పై అక్రమంగా రేషన్​ బియ్యం తరలింపు కేసు కూడా ఉన్నట్లు డిసిపి పేర్కొన్నారు. ఈ సమావేశంలో దక్షిణమండలం అదనపు డిసిపి సయ్యద్​ రఫిక్, సంతోష్​నగర్​ ఏసీపీ శివరాం శర్మ, కంచన్​బాగ్​ ఇన్​స్పెక్టర్​ జి. వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Reporter:  నూర్ మహమ్మద్ Hyderabad tv9 telugu

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు ఏ రాశివారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయంటే..

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే