Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Crime News: కిడ్నాప్​కు గురైన ఆరేళ్ల బాలికను 24 గంటల్లోనే తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించిన పోలీసులు

Hyderabad Crime News: కిడ్నప్ కు గురైన బాలికను 23 గంటల్లోనే తిరిగి తల్లివద్దకు చేర్చారు హైదరాబాద్ పోలీసులు. మంగళవారం పురానిహవేలిలోని డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో..

Hyderabad Crime News: కిడ్నాప్​కు గురైన ఆరేళ్ల బాలికను 24 గంటల్లోనే తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించిన పోలీసులు
Hyderabad Crime News
Follow us
Surya Kala

|

Updated on: Sep 15, 2021 | 8:00 AM

Hyderabad Crime News: కిడ్నప్ కు గురైన బాలికను 23 గంటల్లోనే తిరిగి తల్లివద్దకు చేర్చారు హైదరాబాద్ పోలీసులు. మంగళవారం పురానిహవేలిలోని డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డిసిపి గజరావు భూపాల్ వివరాలను వెల్లడించారు. అంబర్​పేట్​ ఆలీకేఫ్​ ప్రాంతానికి చెందిన ముస్కాన్​ ఆలీ మీర్జా(41) తన కూతురు అల్ఫియా(6)తో కలిసి భిక్షాటన చేస్తుంది. కాగా ఈ నెల 13వ తేదీన ఉదయం 11గంటల సమయంలో చంచల్​గూడలో బిక్షాటన చేస్తుండగా ఓ మహిళ వాళ్ల దగ్గరికి వచ్చి తన పేరు ఫాతిమా అని హఫీజ్​బాబానగర్​లో ఓ స్వచ్చంద సేవా సంస్థ పెద్ద ఎత్తున బట్టలు, డబ్బు దానం (జకాత్​) ఇస్తుంటారని నమ్మబలికింది. వెంటనే వారిని ఆటోలో ఎక్కించుకుని హఫీజ్​బాబానగర్​కు చేరుకుంది. అక్కడే ఉన్న ఓ ఇంటిని మీర్జాకు చూపెట్టింది. ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్లి జకాత్​ తీసుకో అని మాయమాటలు చెప్పింది. ఆటో దిగి కాస్త ముందుకు మీర్జా వెళ్లగానే ఆరేళ్ల మైనర్​ బాలికతో ఆటోలో ఫాతిమా పరారయ్యింది.

మీర్జా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచన్​బాగ్​ పోలీసులు కేసును నమోదు చేసుకుని సంతోష్​నగర్​ డివిజన్​ ఏసీపీ శివరాం శర్మ పర్యవేక్షణలో ఐదు బృందాలను రంగంలోకి దింపారు. హఫీజ్​బాబానగర్​ నుంచి రెండు ఆటోలను మార్చుతూ ఫాతిమా బాలికతో శంషాబాద్​కు చేరుకుంది. అక్కడి నుంచి షాద్​నగర్​లోని సొంత ఇంటికి బాలికను కిడ్నాప్​ చేసి తీసుకువెళ్లినట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు గుర్తించారు. పోలీసులు వెంటనే ఫాతిమాగా చెప్పుకున్న ఆసియా బి(26) ను అదుపులోకి తీసుకుని కిడ్నాపర్​ చెర నుంచి బాలికకు విముక్తి కలిగించారు. శంషాబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆసియాబి పై అక్రమంగా రేషన్​ బియ్యం తరలింపు కేసు కూడా ఉన్నట్లు డిసిపి పేర్కొన్నారు. ఈ సమావేశంలో దక్షిణమండలం అదనపు డిసిపి సయ్యద్​ రఫిక్, సంతోష్​నగర్​ ఏసీపీ శివరాం శర్మ, కంచన్​బాగ్​ ఇన్​స్పెక్టర్​ జి. వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Reporter:  నూర్ మహమ్మద్ Hyderabad tv9 telugu

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు ఏ రాశివారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయంటే..

Horoscope Today: వారు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది..
Horoscope Today: వారు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది..
భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!