Uttar Pradesh: పోలీసుల మెడకు చుట్టుకుంటున్న గ్యాంగ్స్టర్ కూతురు అనుమానాస్పద మృతి.. ఎస్హెచ్ఓ సస్పెండ్!
ఉత్తరప్రదేశ్లో మరోసారి పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చందౌలీలో హిస్టరీ షీటర్ కూతురు మృతి కేసు పోలీసుల మెడకు చుట్టుకుంటోంది.
Chandauli News: ఉత్తరప్రదేశ్లో మరోసారి పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చందౌలీలో హిస్టరీ షీటర్ కూతురు మృతి కేసు పోలీసుల మెడకు చుట్టుకుంటోంది. గ్యాంగ్స్టర్ కన్హయ్య యాదవ్ ఇంటిపై దాడికి వెళ్లిన పోలీసులు.. ఆ నేరస్థుడి కుమార్తెలను కొట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఒక కూతురు కూడా మరణించింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు, నిందితుడు సయ్యద్ రాజా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఉదయ్ ప్రతాప్ సింగ్ను సస్పెండ్ చేశారు.
వైరల్గా మారిన వీడియోలో, యువతులిద్దరూ యూపీ పోలీసుల దౌర్జన్యానికి గురైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. విషయం చందౌలీలోని మన్రాజ్పూర్ గ్రామం. దాడికి దిగిన పోలీసులు గ్యాంగ్స్టర్ కన్హయ్య యాదవ్ కుమార్తెలను దారుణంగా కొట్టారని ఆరోపించారు. పోలీసుల దాడిలో కన్హయ్య యాదవ్ కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలియగానే సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని తోపులాట సృష్టించారు. అనంతరం ఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
విచారణ ప్రారంభించిన వెంటనే ఈ కేసులో చర్యలు ముమ్మరం చేశారు పోలీసు ఉన్నతాధికారులు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే ఈ కేసులో ఇన్స్పెక్టర్ సయ్యద్ రాజాను సస్పెండ్ చేశారు. హిస్టరీ షీటర్ కన్హయ్య యాదవ్ ఇంట్లోకి ప్రవేశించి అతని కుమార్తెలపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. పోలీసుల కొట్టడం వల్లే ఓ బాలిక చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా మరో కుమార్తె ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. హిస్టరీ షీటర్ కన్హయ్య యాదవ్ను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇప్పుడు ఈ కేసులో ఐజీ కె. సత్యనారాయణ ప్రకటన వెలువడింది. సాయిదరాజా పోలీస్ స్టేషన్ చీఫ్ ఉదయ్ ప్రతాప్ సింగ్ను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. చనిపోయిన యువతి మృతదేహం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు. కన్హయ్య యాదవ్పై గ్యాంగ్స్టర్ ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో, ఈ వ్యవహారంలో ప్రతి కోణంలో దర్యాప్తు చేస్తామని డీఎం సంజీవ్ సింగ్ తెలిపారు. కాగా, ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంది.
UP Police raid gangster Kanhaiya Yadav's house in Chandauli
A video was viral in which a woman died. Police reached suspect Kanhaiya Yadav's house; he wasn't found. Probe underway;prima facie suicide,we're awaiting post mortem report. Sufficient police deployed:SP Ankur Aggarwal pic.twitter.com/CsAQrxO1bI
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 1, 2022
Read Also…. Humanity Video: నడిరోడ్డుపై హఠాత్తుగా పడిపోయిన వ్యక్తి.. పరుగెత్తుకొచ్చిన జనం.. చివరికి..