Food Poison: అమ్మాయి ప్రాణం తీసిన ‘షవర్మా’.. 16 ఏళ్ల యువతి మృతి.. మరో 35 మందికి..

Food Poison: ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా యువతి మృతి చెందిన ఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. షవర్మా తినడం వల్ల 16 ఏళ్ల యువతి మరణించడంతో పాటు మరో 18 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ షాకింగ్ సంఘటన...

Food Poison: అమ్మాయి ప్రాణం తీసిన 'షవర్మా'.. 16 ఏళ్ల యువతి మృతి.. మరో 35 మందికి..
Shawarma
Follow us

|

Updated on: May 02, 2022 | 8:44 AM

Food Poison: ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా యువతి మృతి చెందిన ఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. షవర్మా తినడం వల్ల 16 ఏళ్ల యువతి మరణించడంతో పాటు మరో 18 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ షాకింగ్ సంఘటన కేరళలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కన్హన్‌గడ్‌లోని కొంత మంది విద్యార్థులు స్థానికంగా ఉన్న ఓ బేకరీలో షవర్మా తిన్నారు. షవర్మా తిన్నవారంతా అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో 16 ఏళ్ల దేవానంద అనే టీనేజీ యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది.

దీంతో ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. మిగతా వారంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అస్వస్థకు గురైన విద్యార్థులు జ్వరం, డయేరితో ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాణాపాయం లేదని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని జిల్లా వైద్యాధికారి డా. ఏవీ రాందాస్‌ తెలిపారు. రంగంలోకి దిగిన అధికారులు సదరు దుకాణంపై కేసు నమోదు చేసి సీజ్‌ చేశారు.

ఇదిలా ఉంటే ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జి ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. అస్వస్థతకు గురైన ఇతరులకు నాణ్యమైన చికిత్స అందించాలని తెలిపారు. దీనంతటికీ ఫుడ్‌ పాయిజన్‌ కావడమే కారణమని అధికారులు అంచనాకు వచ్చారు. దర్యాప్తునకు ఆదేశించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Dining Out: సరదాగా బయట తినాలంటే బిల్లు’ వర్రీనా? ఇలా చేస్తే ‘నో టెన్షన్

కన్నబిడ్డలను గొడ్డలితో నరికి చంపిన తండ్రి.. మద్యం మత్తులో దారుణం

Aunty dance: ఆంటీనా మాజాకా.! మందేసి చిందేస్తూ నాగిని డాన్స్‌తో రెచ్చిపోయిన ఆంటీ..

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?