కార్తీక దీపం 2లో జ్యోత్స్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ?

Rajitha Chanti

Pic credit - Instagram

01 August 2026

తెలుగు బుల్లితెరపై ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పిన సీరియల్ 'కార్తీక దీపం'. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా వస్తున్న 'కార్తీక దీపం 2' ప్రసారమవుతుంది.

ఈ సీరియల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ, తన పవర్ ఫుల్ విలనిజంతో ప్రేక్షకులను అలరిస్తున్న పాత్ర 'జ్యోత్స్న'. అలియాస్ గాయత్రి సింహాద్రి.

ఈ పాత్రలో నెగెటివ్ షేడ్స్, సైకోయిజం పండిస్తూ నటి గాయత్రి సింహాద్రి తన యాక్టింగ్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటోంది.

గాయత్రి సింహాద్రి సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. చిన్నతనం నుంచే ఆమెకు నాటకాలు, స్టేజ్ పెర్ఫార్మన్స్‌లపై ఎంతో ఆసక్తి ఉండేది.

మొదట వైజాగ్ లోని లోకల్ ఛానెళ్లు, యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రత్యేక ఈవెంట్లకు హోస్ట్‌గా చేస్తూ పాపులర్ అయ్యింది.

తొలినాళ్లలోనే 'ముద్ద మందారం', 'కళ్యాణ వైభోగం' వంటి సూపర్ హిట్ సీరియళ్లలో వైవిధ్యమైన పాత్రలు చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. 

'కార్తీక దీపం 2' సీరియల్ లో జ్యోత్స్న పాత్ర ప్రాధాన్యత పెరగడంతో గాయత్రి సింహాద్రికి మేకర్స్ భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది.

ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 20,000 నుండి రూ. 40,000 వరకు ప్రతిఫలంగా చెల్లిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.