AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వైజాగ్‌ వివాహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్‌.. సాయి ప్రియ ఏం చేసిందో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..

Andhra Pradesh: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తప్పి పోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపడుతోన్న అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి..

Andhra Pradesh: వైజాగ్‌ వివాహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్‌.. సాయి ప్రియ ఏం చేసిందో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..
Sai Priya
Narender Vaitla
|

Updated on: Jul 27, 2022 | 1:02 PM

Share

Andhra Pradesh: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తప్పి పోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపడుతోన్న అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. సముద్రంలో గల్లంతైందని అందరూ భావిస్తుండగా సాయి ప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది. సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు ఆమె బంధువులు గుర్తించారు. ప్రేమిడికుడితో కలిసి పారిపోయినట్లు గుర్తించారు. శ్రీనివాస్‌తో వివాహానికి కంటే ముందు.. సాయి ప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. వివాహానికి ముందు రెండు సార్లు రవితో కలిసి సాయి ప్రియ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు శ్రీనివాస్‌ను 2020 జూలై 25న పెళ్లి చేసుకుంది.

శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండడంతో ఈ జంట హైదరాబాద్‌లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్‌ డే అని శ్రీనివాస్‌ ఈ నెల 25న హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5.30 కి భర్త తో కలిసి బీచ్‌కి వెళ్లిన సాయి ప్రియ, అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది. శ్రీనివాస్‌ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్‌ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

గాలింపు కోసం రూ. కోటి ఖర్చు..

ఇదిలా ఉంటే సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు రూ. కోటి ఖర్చు చేసింది. ఈ విషయమై విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ మాట్లాడుతూ.. వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని, ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.

Follow Us
36 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన స్పెయిన్ గోల్‌కీపర్
36 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన స్పెయిన్ గోల్‌కీపర్
మారుతున్న మూడ్ స్వింగ్స్, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసా
మారుతున్న మూడ్ స్వింగ్స్, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసా
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ ఫైట్
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ ఫైట్
ఆ సినిమా రిలీజ్ చేసి పెద్ద తప్పు చేశా..
ఆ సినిమా రిలీజ్ చేసి పెద్ద తప్పు చేశా..
పుంగనూరు జాతి ఆవులు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
పుంగనూరు జాతి ఆవులు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
తల్లిదండ్రులు చేసే ఈ చిన్న పొరపాటుతో పిల్లల ప్రాణాలకే ముప్పు..
తల్లిదండ్రులు చేసే ఈ చిన్న పొరపాటుతో పిల్లల ప్రాణాలకే ముప్పు..
టోల్ ప్లాజా వద్ద కళ్ల ముందే కాలిపోయిన గ్యాస్ ట్యాంకర్!
టోల్ ప్లాజా వద్ద కళ్ల ముందే కాలిపోయిన గ్యాస్ ట్యాంకర్!
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి
వందేళ్ల వరద వచ్చినా నో టెన్షన్..! మూసీ నదిపై భారీ ప్లాన్!
వందేళ్ల వరద వచ్చినా నో టెన్షన్..! మూసీ నదిపై భారీ ప్లాన్!
పాము పిల్ల గురించి ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
పాము పిల్ల గురించి ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..