AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో దారుణం.. మాట్లాడుదాం అంటూ ఇంటికి పిలిచి కన్న కూతురుపై..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల దేవనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతురి పై కత్తితో దాడి చేశాడు..

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో దారుణం.. మాట్లాడుదాం అంటూ ఇంటికి పిలిచి కన్న కూతురుపై..
Attack
Shiva Prajapati
| Edited By: |

Updated on: Sep 13, 2021 | 11:00 AM

Share

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల దేవనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతురి పై కత్తితో దాడి చేశాడు ఓ తండ్రి. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కత్తి పోట్లకు గురైన నవ వధువు ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ‌చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై త్రీటౌన్ పోలీసులు కేసు ‌నమోదు చేసి దర్యాప్తు చేస్తూన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు ‌జిల్లా నంద్యాల హరిజన పేటకు చెందిన మంజు, దేవ నగర్ కు చెందిన మళ్ళీశ్వరి ఇద్దరు ఒకరికొకరు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం తమ ప్రేమ విషయాన్ని అమ్మాయి తండ్రి ఆంజనేయుల దృష్టికి తీసుకెళ్ళింది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మంజుకు ఇచ్చి వివాహం చేయ్యడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు ఆ తండ్రి. అంతే కాకుండా అమ్మాయి కి వేరే వ్యక్తితో పెళ్లి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. దాంతో పది రోజుల ‌క్రితం అమ్మాయి, అబ్బాయి ఇద్దరి ఇంటినుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వేరే ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు.

అయితే, తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న తన కూతురుపై పట్టలేని ఆగ్రహాన్ని పెంచుకున్నాడు తండ్రి ఆంజనేయులు. ఎలాగైన కూతురుని అంతమొందించాలని ప్లాన్ వేసుకున్నాడు. ఈ క్రమంలోనే వారి ప్రేమ వివాహాన్ని అంగీకరించినట్లు వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అమ్మాయి, అబ్బాయిని మాట్లడాలి రా అంటూ ఇంటికి పిలిచాడు. మాటల మద్యలో తండ్రి ఒక్కసారిగా కన్న కూతురిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో నవ వధువు మల్లీశ్వరికి మెడకు, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మళ్ళీశ్వరిని భర్త మంజు నంద్యాల ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఈ దాడిపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూన్నారు. మళ్లీశ్వరిపై దాడి చేసిన ఆంజనేయులుని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Also read:

Prakasam District: రిటైర్మెంట్‌కు ముందు బకాసురుడిగా మారిన తహశీల్దార్.. ఏకంగా 378 ఎకరాల ప్రభుత్వ భూములు ఆన్లైన్

IPL 2021: ఐపీఎల్‌ చరిత్రలో భయంకరమైన ఓపెనర్లు వీరే.. టాప్ 5లో ఈ బ్యాట్స్‌మెన్‌ని చూసి షాకవుతారంతే?

Telangana: ఆటో కిరాయి కోసం గొడవ.. పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్.. ఎక్కడ జరిగిందంటే..

స్మశానవాటికలో అస్థిపంజరంతో మహిళ నృత్యం.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం

Follow Us
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి