Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న స్కార్పియో.. నలుగురి మృతి..
Nandyala District: ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల (Nandyala) జిల్లాలో ఆదివారంఅర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్పియో కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో
Nandyala District: ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల (Nandyala) జిల్లాలో ఆదివారంఅర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్పియో కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఆళ్లగడ్డ మండలం గూబగుండం మిట్ట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతులు కడప జిల్లా మైదుకూరు వాసులుగా గుర్తించారు. మద్దిలేటి స్వామి దర్శనానికి వెళ్లివస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Kashmir: కశ్మీర్ ఉగ్రవాద గ్రూపుల వద్ద అత్యాధునిక అమెరికా పరికరాలు.. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే..