AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సెక్యూరిటీపై దాడి.. హైదరాబాద్‌ జువైనల్‌ హోమ్‌ నుంచి మైనర్లు ఎస్కేప్.. దొరకని ఆచూకి

హైదరాబాద్‌లోని జువైనల్‌ హోమ్‌ నుంచి పరారైన మైనర్ల ఆచూకీ దొరకలేదు. సెక్యూరిటిపై ఎటాక్ చేసి చాకచాక్యంగా తప్పించుకుపోయిన..

Hyderabad: సెక్యూరిటీపై దాడి.. హైదరాబాద్‌ జువైనల్‌ హోమ్‌ నుంచి మైనర్లు ఎస్కేప్.. దొరకని ఆచూకి
Hyderabad Juvenile Home
Ram Naramaneni
|

Updated on: Aug 09, 2021 | 1:20 PM

Share

హైదరాబాద్‌లోని జువైనల్‌ హోమ్‌ నుంచి పరారైన మైనర్ల ఆచూకీ దొరకలేదు. సెక్యూరిటిపై ఎటాక్ చేసి చాకచాక్యంగా తప్పించుకుపోయిన పిల్లలు ఎక్కడికి వెళ్లారు.. ఎందుకు ఎస్కేప్ అయ్యారన్నది మిస్టరీగా మారింది. వాళ్ల జాడ కోసం అటు సీడబ్ల్యూసీ.. ఇటు పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా పిల్లలకు సంబంధించి ఎలాంటి క్లూ దొరకలేదు. బిహార్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన మైనర్లు ఆపరేషన్ ముస్కాన్‌లో పట్టుబడ్డారు. వారిని సైదాబాద్‌లోని జువైనల్‌హోమ్‌కి తరలించారు. ఆదివారం సిబ్బంది ఎక్కువగా ఉండరని గమనించిన పది మంది పిల్లలు హోమ్‌నుంచి పారిపోవాలని భావించారు. గేట్ తాళం తీసుకుని బయటకు వెళ్తుండగా సెక్యూరిటీ అడ్డుకున్నాడు. అతనిపై దాడి చేసి వెళ్లిపోయారు. మైనర్లు పరారీ కావడంతో జువైనల్ హోమ్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పది మంది పిల్లల్లో నలుగురు మాత్రమే దొరికారు. మిగతా వాళ్ల జాడ తెలియకుండా పోయింది. జువైనల్ హోమ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు వెళ్లిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పోలీసులు వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా వారిని పట్టుకుంటామన్నారు.

టిప్పర్‌కు తగిలిన విద్యుత్‌ తీగలు… ముగ్గురు మృతి

కంకర తరలిస్తున్న టిప్పర్​కు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి చెందిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది. పాలసముద్రం మండలం కనికాపురంలో ఉదయం జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్​తో పాటు మరో ఇద్దరు యువకులు ప్రాణాలు విడిచారు. కనికాపురంలో ఇల్లు నిర్మించుకుంటున్న మునిస్వామి నాయుడు తన అవసరాల కోసం జీడీ నెల్లూరు మండలం వేల్పూరు పెద్ద కాలువ నుంచి టిప్పర్​లో కంకరు తెప్పించారు. మునిస్వామి నాయుడు ఇంటి సమీపంలో కంకరను అన్‌లోడ్‌ చేసే సమయంలో కరెంట్ తీగలు గమనించని డ్రైవర్ మనోజ్‌‌.. టిప్పర్ వెనక భాగం పైకెత్తాడు. ఈ క్రమంలో టిప్పర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి కరెంట్‌ ప్రవహించింది. దీంతో డ్రైవర్‌ కేకలు వేశాడు. అతడిని కాపాడే క్రమంలో యువకులు జ్యోతీశ్వర్‌, దొరబాబు కూడా కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:స్టెప్పులతో అదరగొట్టిన డిప్యూటీ సీఎం.. కోలాహలంగా ఆదివాసి సంబరం

 నంద్యాల జర్నలిస్ట్ హత్య కేసులో పురోగతి.. ఇద్దరు నిందితుల అరెస్ట్

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై