AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం కేసీఆర్ చెప్పిన ‘హెలికాఫ్టర్ మనీ’కి అర్థమేంటంటే..?

హెలీకాఫ్టర్ మనీ అంటే ఏంటంటే.. ప్రజలకు ఉచితంగా డబ్బు ఇవ్వడం. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త ఫ్రెడ్ మ్యాన్ 1969‌లో ఈ విధానాన్ని ప్రతిపాదించారు. 2002లో ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ బెన్ బెర్నాంకే దీన్ని ప్రాచుర్యంలోకి..

సీఎం కేసీఆర్ చెప్పిన 'హెలికాఫ్టర్ మనీ'కి అర్థమేంటంటే..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 12, 2020 | 9:44 PM

Share

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి కేంద్ర ప్రభుత్వం. కానీ దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. వస్తు, సేవల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఆర్థిక వ్యవ్వస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం నుంచి 2.8 శాతానికి పడిపోవచ్చని ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు హెలికాఫ్టర్ మనీ, క్యూఈ ఆర్థిక విధానాలు చేపట్టాలని ప్రధానికి సీఎం కేసీఆర్ సూచించడం వల్ల ఇవి తెరపైకి వచ్చాయి.

హెలీకాఫ్టర్ మనీ అంటే ఏంటంటే.. ప్రజలకు ఉచితంగా డబ్బు ఇవ్వడం. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త ఫ్రెడ్ మ్యాన్ 1969‌లో ఈ విధానాన్ని ప్రతిపాదించారు. 2002లో ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ బెన్ బెర్నాంకే దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ విషయంలో మన దేశంలో ఆర్బీఐ కీలక పాత్ర వహించాలి. దీని ప్రకారం నోట్ల ముద్రణ పెంచి ఆర్థిక వ్యవస్థలోకి పెద్ద ఎత్తున నగదును చలామణీలోకి తీసుకురావడం దీని ముఖ్య ఉద్ధేశం.

ప్రజలకు నేరుగా డబ్బులు చేరవేసి వారి కొనగోలు శక్తిని పెంచడం దీని వెనుకున్న ఆంతర్యం. ప్రస్తుతం ప్రజల వద్ద డబ్బులు లేక కొనుగోలు బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ను, సప్లయ్‌ను పెంచడానికి ఈ విధానం దోహద పడుతుంది. క్వాంటిటేటివ్ ఈజింగ్ కూడా ఇలాంటిదే అయినా దీనికి ప్రభుత్వం వద్ద నుంచి ఆర్బీఐ బాండ్లు కొనుగోలు చేస్తుంది. కాగా ఇంతకుముందు ఈ విధానాన్ని అమెరికా, జపాన్ వంటి దేశాలు అవలంభించాయి. 2008లో సంభవించిన ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కొనేందుకు అమెరికా హెలీకాఫ్టర్ మనీ విధానాన్ని అనుసరించింది. అలగే 2016లో జపాన్ సైతం హెలీకాఫ్టర్ మనీ విధానాన్ని అవలంభించింది.

కాగా నోట్లను ఎందుకు ఎల్లప్పుడూ ముద్రించరనే ప్రశ్న తలెత్తవవచ్చు. దేశంలో వస్తుసేవల ఉత్పత్తి ఆధారణంగా ఈ నోట్లను ముద్రించి.. ఆర్బీఐ చలామణీలోకి తీసుకొస్తుంది. ఒకవేళ నిత్యం నోట్లను పెద్ద సంఖ్యలో ముద్రించి జనాలకు చేరవేస్తే కొన్నాళ్లు రూపాయి విలువ మరింత దారుణంగా పడిపోయి.. ద్రవ్యోల్బణం భారీ స్థాయిలో పెరిగిపోతుంది.

ఇవి కూడా చదవండి:

ఈ దెబ్బకు జగన్ ఉద్యోగం ఊడినా ఆశ్చర్యపోనవసరం లేదు

ఐసోలేషన్, క్వారంటైన్‌కు మధ్య తేడాలేంటంటే?

హ్యాకర్ల నుంచి మీ ఫోన్‌ను రక్షించుకోండిలా..!

కరోనా బాధితుల్లో స్మోకింగ్ చేసేవారే ఎక్కువ

Follow Us
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..