AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS coronavirus: తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 431 మందికి పాజిటివ్, ఇద్దరు మృతి

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 421 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

TS coronavirus: తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 431 మందికి పాజిటివ్, ఇద్దరు మృతి
Balaraju Goud
|

Updated on: Mar 24, 2021 | 11:57 AM

Share

Telangana  Corona: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 421 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. కాగా మంగళవారం కరోనాతో ఇద్దరు చనిపోయారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో విడత విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా క్రమంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగంతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 431 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3,04,298కు చేరింది. మంగళవారం 228 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇద్దరు మరణించారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి 2,99,270 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం మృతుల సంఖ్య 1,676కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,352 యాక్టివ్‌ కేసులుండగా.. 1,359 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.55శాతం ఉండగా, రికవరీ రేటు 98.34శాతంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Telangana Today Corona Cases

Telangana Today Corona Cases

కరోనా కేసులు పెరుగుతుండటంతో బుధవారం నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నీ మూసివేస్తున్న ప్రభుత్వం మంగళవారం శాసనసభలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది విద్యార్థులు కరోనా బారిన పడటంతోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సినిమా థియేటర్లను సైతం మూసివేయాలని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

మరోవైపు పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, వర్తక, వాణిజ్య సంస్థల్లో భౌతిక దూరం పాటిస్తూ, ఖచ్చితమైన కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది.

Read Also… కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో మళ్లీ మూతపడనున్న థియేటర్లు.? ప్రణాళికలు సిద్దం చేస్తోన్న ప్రభుత్వం.!

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే