AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో మళ్లీ కోవిడ్ టెస్టులు.. ఈ ప్రాంతాల్లోనే..

హైదరాబాద్‌లో మళ్లీ కోవిడ్ పరీక్షలు నిర్వహించనుంది  తెలంగాణ ప్రభుత్వం. నేటి నుంచి పలు ప్రాంతాల్లో ఈ టెస్టులు మొదలు కానున్నాయి. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి 50 వేల మందికి కరోనా పరీక్షలు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తిరిగి కరోనా పరీక్షలు..

హైదరాబాద్‌లో మళ్లీ కోవిడ్ టెస్టులు.. ఈ ప్రాంతాల్లోనే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 30, 2020 | 2:01 PM

Share

హైదరాబాద్‌లో మళ్లీ కోవిడ్ పరీక్షలు నిర్వహించనుంది  తెలంగాణ ప్రభుత్వం. నేటి నుంచి పలు ప్రాంతాల్లో ఈ టెస్టులు మొదలు కానున్నాయి. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి 50 వేల మందికి కరోనా పరీక్షలు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తిరిగి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ ఎత్తున కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కాగా ఈ నెల 16 నుంచి 24 వరకూ నిర్దేశించిన అసెంబ్లీ నియోజక వర్గాల్లో 36 వేల శాంపిళ్లను తీసుకున్నారు. అందులో దాదాపు 27 వేలకు పైగా నమూనాలను పరిశీలించి ఫలితాలు ప్రకటించారు. అయితే మిగిలిన పరీక్షలు చేసేందుకు సామర్థ్యం లేకపోవడంతో తాత్కాలికంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు అధికారులు. ప్రస్తుతం ఈ పెండింగ్ పనులు కూడా పూర్తి కావడంతో తిరిగి పరీక్షలు చేయాలని అధికారులు రంగం సిద్ధం చేశారు.

ముఖ్యంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్లీ పరీక్షలు తిరిగి ప్రారంభం చేశారు. హైదరాబాద్ పరిధిలోని 30 నియోజకవర్గాల్లో ఈ శాంపిల్స్ సేకరణ ప్రక్రియ కొనసాగనుంది. కొండాపూర్, బాలాపూర్, వనస్థలిపురం, అంబర్ పేట్, గోల్కొండ, రామంతపూర్‌‌లోని హోమియో ఆస్పత్రి, ఎర్రగడ్డ ఆయుర్వేదిక్, సరోజినీ ఆసుపత్రి తదితర నిర్దేశించిన ప్రాంతాల్లో కరోనా శాంపిళ్లను స్వీకరించనున్నారు వైద్యులు. కాగా కరోనా వైరస్ లక్షణాలున్నవారు మాత్రమే ఈ పరీక్షలు చేయించుకోవాలని వైద్యారోగ్య శాఖ పేర్కొంది.

Read More: ఏపీ మంత్రి పేర్ని నానికి అస్వస్థత..

మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్