AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ నేటి నుంచే..

తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యంతో పాటు రూ.1500 నగదను కూడా అందజేస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో బియ్యం, నగదు అందజేసిన ప్రభుత్వం, మరోసారి..

తెలంగాణలో రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ నేటి నుంచే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 01, 2020 | 9:03 AM

Share

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌కి ముఖ్యంగా కూలీలు, నిరు పేదలు ఉపాధి కోల్పోయారు. దీంతో వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యంతో పాటు రూ.1500 నగదను కూడా అందజేస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో బియ్యం, నగదు అందజేసిన ప్రభుత్వం, మరోసారి అందించేందుకు సిద్ధమైంది. నేటి నుంచే రెండో విడత ప్రారంభం కానుందని, రేషన్ కార్డు ఉన్న వారికి ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, ఒక్కో కార్డుపై రూ.1500ల నగదు అందించనుంది.

కాగా నిజమాబాద్, నల్గొండ, వరంగల్ రూరల్, మెదక్ జిల్లాల్లో ప్రతీ కార్డు దారుడికి కిలో కందిపప్పు కూడా పంపిణీ చేయనుంది ప్రభుత్వం. నాఫెడ్ ద్వారా రాష్ట్రానికి నెలకు 8,754 టన్నుల కందిప్పు రావాల్సి ఉంది. ఇప్పటివరకూ 3,233 టన్నులు మాత్రమే వచ్చింది. దీంతో ముందుగా నాలుగు జిల్లాల్లలో పంపిణీ చేసి.. మిగిలిన 29 జిల్లాల్లో 15వ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు అధికారులు. అలాగే రూ.1500 నగదు బ్యాంకు ఖాతాల్లో పడని వారికి పోస్టాఫీసు ఖాతాల్లో జమచేయనున్నారు. మే 1న బ్యాంకులకు సెలవు కావడంతో 2వ తేదీ నుంచి ఈ నగదును జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.

Read More: 

మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి

జర్నలిస్ట్‌కి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌కు నలుగురు మంత్రులు