Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జర్నలిస్ట్‌కి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌కు నలుగురు మంత్రులు

కర్ణాటకకు చెందిన ఓ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ రావడంతో.. నలుగురు మంత్రులు క్వారంటైన్‌కు వెళ్లారు. ఓ స్థానిక టీవీ ఛానెల్ వీడియో జర్నలిస్ట్‌కు కరోనా రావడంతో వారు సెల్ఫ్ క్వారంటైన్‌కు..

జర్నలిస్ట్‌కి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌కు నలుగురు మంత్రులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 30, 2020 | 11:43 AM

కర్ణాటకకు చెందిన ఓ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ రావడంతో.. నలుగురు మంత్రులు క్వారంటైన్‌కు వెళ్లారు. ఓ స్థానిక టీవీ ఛానెల్ వీడియో జర్నలిస్ట్‌కు కరోనా రావడంతో వారు సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లారు. వారిలో నలుగురు మంత్రులు డిప్యూటీ సీఎం డాక్టర్ అశ్వత్థ నారాయణ కూడా ఉన్నారు. తాము స్వీయ నిర్భంధంలోకి వెళ్తున్నట్లు నలుగురు మంత్రులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

అశ్వత్థ నారాయణతో పాటు హోంమంత్రి బస్వరాజ్ బొమ్మై, వైద్య విద్య శాఖ మంతరి డాక్టర్ సుధాకర్, పర్యాటక మంత్రి సీటీ రవి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తాము పరీక్షలు చేయించుకున్నామని, పరీక్షల్లో నెగెటివ్ ఉన్నట్లు తేలిందని, అయినప్పటికీ తాము క్వారంటైన్‌కు వెళ్తున్నామని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఓ వీడియో జర్నలిస్టుకు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు ఈ నెల 24వ తేదీన నిర్థారణ అయింది. అతను మంత్రులను ఏప్రిల్ 21, 24 తేదీల మధ్య కలిశాడు. వీడియో జర్నలిస్టుతో కాంటాక్ట్‌లోకి వచ్చిన కనీసం 40 మందిని క్వారంటైన్‌కు తరలించారు. కాగా కర్ణాటకలో ఇప్పటివరకూ 532 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 215 మంది రోగులు కోలుకున్నారు.

Read More: 

వెహికల్ ట్యాక్స్‌పై స్వల్ప ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం

గుడ్‌న్యూస్: వడ్డీ లేకుండా అప్పు.. కానీ షరతులు వర్తిస్తాయి!

మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి